యాప్నగరం

బంగారం ధర జిల్ జిల్ జిగేల్.. భారీగా పెరిగిన వెండి!

Gold Rates Today | బంగారం ధర పైపైకి కదిలింది. పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్ రేటు కొండెక్కింది. దీంతో బంగారం కొనాలనుకునే వారిపై ప్రభావం పడుతోంది. రానున్న రోజుల్లో కూడా బంగారం ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల పసిడి కొనాలంటే కొనేసుకోవడం ఉత్తమం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 2 వేల డాలర్ల పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మన దేశంలో కూడా ధరలు భారీగా పెరగొచ్చు.

Authored byKhalimastan | Samayam Telugu 19 Apr 2022, 5:55 am

ప్రధానాంశాలు:

  • పసిడి రేటు పరుగులు పెడుతూ వస్తోంది
  • రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ఈరోజు పైకి చేరింది
  • బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది
  • ఏకంగా రూ.75 వేలు దాటిపోయిన సిల్వర్ రేటు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gold Prices: బంగారం
బంగారం ధర మెరిసింది. పసిడి రేటు పరుగులు పెడుతూనే ఉంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి రేటు Gold Rate ఈరోజు మాత్రం జిగేల్ మంది. ఏప్రిల్ 19న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగింది. రూ. 49,850కు చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు Gold Price అయితే రూ. 320 పెరుగుదలతో రూ. 54,380కు ఎగసింది. అంటే పసిడి రేటు రూ. 55 వేల దిశగా దూసుకుపోతోంది. తులం బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారిపై ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు వెండి ధరల Silver Rate విషయానికి వస్తే సిల్వర్ రేటు నేడు భారీగా పెరిగింది. రూ.1000 పైకి కదిలింది. దీంతో వెండి ధర Silver Price రూ.75,200 స్థాయికి చేరింది. వెండి గజ్జలు, కడియాలు, జువెలరీ కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేట్లు వర్తిస్తాయి. అయితే వీటికి జీఎస్టీ, తయారీ చార్జీలు వంటివి కలుపలేదు. అందువల్ల రిటైల్ ధరలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం చూస్తే.. జీఎస్‌టీ కలుపకుండా బంగారం ధర రూ.53,603 వద్ద ఉంది. 999 స్వచ్ఛత కలిగిన గోల్డ్‌కు ఈ రేటు వర్తిస్తుంది. 916 బంగారం ధర రూ.59,100 వద్ద కొనసాగుతోంది. ఇక 750 స్వచ్ఛత బంగారం రేటు రూ.40,202 వద్ద ఉంది. 585 గోల్డ్ ధర రూ.31,358కు కొనొచ్చు. వెండి రేటు 70,109 వద్ద కొనసాగుతోంది.


బంగారం సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ద్రవ్యోల్బణం పెరగడం, రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు వల్ల పసిడి డిమాండ్ పెరిగింది. ఈ రెండు అంశాలు ఎన్ని రోజులైతే కొనసాగుతాయో అన్ని రోజులపాటు బంగారం ధరలు పెరుగుతూ రావొచ్చు’ అని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ రవి సింగ్ తెలిపారు. అందువల్ల బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పారు. పసిడి రేటు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయొచ్చని సిఫార్సు చేశారు. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1981 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ రేటు రానున్న రోజుల్లో 2 వేల డాలర్ల పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.