యాప్నగరం

Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు.. తగ్గాయా? పెరిగాయా?

బంగారం ధరలు పెరిగాయి. నిన్న పడిపోయిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. బంగారం ధరలు జిగేల్ మన్నాయి. అయితే వెండి ధర మాత్రం పడిపోయింది. సిల్వర్ రేటు ఈరోజు కూడా నేలచూపులు చూసింది. వెండి ధర నిన్న కూడా తగ్గింది. కాగా మరోవైపు రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు పైపైకి కదిలే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర వచ్చే ఆరు నెలల కాలంలో 20 శాతం పైకి చేరొచ్చు.

Authored byKhalimastan | Samayam Telugu 20 May 2022, 6:53 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే
  • మరి వెండి రేటు తగ్గిందా? పెరిగిందా?
  • గ్లోబల్ మార్కెట్‌లో ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయి?
  • తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold rates
బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? పసిడి రేట్లు ఈరోజు మార్కెట్‌లో జిగేల్ మన్నాయి. బంగారం ధర మే 20న పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 220 దూసుకుపోయింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510కు ఎగసింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ. 200 పెరుగుదలతో రూ. 46,300కు చేరింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పైకి చేరడం గమనార్హం. బంగారం రేట్లు పెరిగితే.. వెండి ధర మాత్రం నేలచూపులు చూసింది. వెండి రేటు ఈరోజు పడిపోయింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 400 తగ్గింది. దీంతో ఈ మెటల్ విలువ రూ. 65 వేలకు దిగివచ్చింది. వెండి ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో వెండి ధర రూ. 600 వరకు పడిపోయింది. అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్‌లో ఒకదాని రేటు పెరిగితే.. మరొకదాని రేటు తగ్గిందని చెప్పుకోవాలి.
వెండి రేటు భారీగా పెరుగుతుందా?
బంగారం ధరలతో పోలిస్తే వెండి ధర మంచి పనితీరు కనబర్చలేదని చెప్పుకోవాలి. అంటే బంగారం కన్నా వెండి రేట్లు ఎక్కువగా తగ్గాయి. ఈ ఇండస్ట్రియల్ మెటల్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. చైనాలో లాక్ డౌన్ ఇందుకు కారణం. అలాగే డాలర్ ఇండెక్స్ ర్యాలీ చేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ప్రస్తుతం వెండి ధర ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు. రూ.58 వేల నుంచి రూ.60 వేల మధ్యలో వెండి కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. రానున్న కాలంలో వెండి రేటు రూ.70 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. సిల్వర్‌ను హైబ్రిడ్ మెటల్‌గా చెప్పుకుంటారు. అందువల్ల పరిశ్రమల నుంచి డిమాండ్ తగ్గినా కూడా వెండి రేటు పడిపోతుంది.

రూ.50 వేల వద్ద డిమాండ్
బంగారానికి రూ. 50 వేల మార్క్ చాలా కీలకమని రిధిసిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. రూ. 50000 అనేది సైకలాజికల్ మార్క్ అని, ఈ స్థాయి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి కనబరుస్తారని వివరించారు. అందువల్ల బంగారానికి ఆ మార్క్ వద్ద డిమాండ్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల కాలంలో బంగారం ధరలో 20 శాతం ర్యాలీ ఉండొచ్చని అంచనా వేశారు. అందువల్ల బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.