యాప్నగరం

Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఉండటం, స్థానికంగా వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో గురువారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Samayam Telugu 6 Dec 2018, 7:29 pm
బంగారం ధరలు వరుసగా నాలుగోరోజు కూడా పెరిగాయి. బుధవారం రూ.100 పెరిగిన బంగారం ధర గురువారంనాటి ట్రేడింగ్‌లో రూ.170 పెరిగింది. తాజా పెంపుతో బంగారం ధర నాలుగు రోజుల్లో రూ.660 వరకు పెరిగినట్లయింది. దీంతో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,950 నుంచి రూ.31,120 కి ఎగబాకగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,800 నుంచి రూ.31,800 నుంచి రూ.31,970 కి చేరింది.
Samayam Telugu Gold Rates


వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో వెండి ధర రూ.25 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.37,600 నుంచి రూ.37,625 చేరుకుంది. గత రెండు రోజుల్లోనే రూ.1200 పెరిగిన వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో కాస్త తగ్గాయి.

ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.24,900 కి చేరింది. ఇక వారంతపు వెండి ధర రూ.35,749 కిచేరింది. ఇక 100 వెండి నాణేల ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కొనుగోలు ధర రూ.73,000 వద్ద, అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1238.4 డాలర్ల వద్ద, వెండి ధర 14.39 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.