GST చెల్లింపుదారులకు మోదీ సర్కార్ భారీ ఊరట!
మీరు జీఎస్టీ చెల్లిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ వార్షిక రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.
Samayam Telugu 24 Oct 2020, 5:10 pm
ప్రధానాంశాలు:
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- వార్షిక రిటర్న్స్ దాఖలుకు మరింత గడువు
- వారందరికీ ఊరట
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. వస్తు సేవల పన్ను GST వార్షిక రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. మరో రెండు నెలల వరకు గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చాలా మందికి ఊరట కలుగనుంది. జీఎస్టీ చెల్లింపుదారులు వారి వార్షిక రిటర్న్స్ను డిసెంబర్ 31లోపు దాఖలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చాలా మంది దగ్గరి నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రిటర్న్స్ (GSTR 9), రీకన్సిలేషన్ స్టేట్మెంట్ (GSTR 9C) సమర్పణకు గడువు పొడిగించాలని చాలా వినతులు వచ్చాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమర్స్ CBIC పేర్కొంది.
Also Read: undefined
Also Read: undefined
కోవిడ్ 19 వల్ల నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో అందరి వినతులను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించిందని సీబీఐసీ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31కు గడువు పొడిగించామని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR గడువును కూడా పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం లేదా 2020-21 అసెస్మెంట్ ఇయర్కు ఇది వర్తిస్తుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ 2019-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ను డిసెంబర్ 31లోపు దాఖలు చేయొచ్చు.
Also Read: undefined
Also Read: undefined
కోవిడ్ 19 వల్ల నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో అందరి వినతులను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించిందని సీబీఐసీ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31కు గడువు పొడిగించామని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR గడువును కూడా పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం లేదా 2020-21 అసెస్మెంట్ ఇయర్కు ఇది వర్తిస్తుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ 2019-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ను డిసెంబర్ 31లోపు దాఖలు చేయొచ్చు.