Goods And Services Tax Rates Set To Increase As Council Eyes Major Revamp
జీఎస్టీ బాదుడు? ధరలు పెరిగేవి ఇవే!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి రెండున్నర ఏళ్లు కావోస్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో మార్పులు చేయాలని భావిస్తోంది. రెవెన్యూ లోటుతో సతమతమౌతున్న మోదీ సర్కార్ ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్టీ రేట్లను సవరించాలని భావిస్తోంది.
Samayam Telugu7 Dec 2019, 6:55 pm
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి రెండున్నర ఏళ్లు కావోస్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో మార్పులు చేయాలని భావిస్తోంది. రెవెన్యూ లోటుతో సతమతమౌతున్న మోదీ సర్కార్ ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్టీ రేట్లను సవరించాలని భావిస్తోంది.
జీఎస్టీ స్లాబుల్లో మార్పు?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను మార్చాలనే యోచనలో ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతమున్న 5 శాతం జీఎస్టీ స్లాబును 9-10 శాతానికి పెంచాలని చూస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే 12 శాతం రేటును తీసేసి, ఇందులోని 243 ఐటమ్స్ను 18 శాతం రేటు స్లాబు కిందకు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఇదే జరిగితే కన్సూమర్లపై పన్ను భారం పెరగనుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.
పన్ను రేట్ల మార్పుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద నిర్ణయం కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మోదీ సర్కార్ కొన్నింటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్స్, రూ.1,000లోపు హోటల్ అకామోడేషన్, అధిక విలువ కలిగిన కంపెనీ హోల్ లీజ్లు వంటి వాటికి మినహాయింపు ఉంది. అయితే కేంద్రం వీటిని మళ్లీ పన్ను పరిధి కిందకు తీసుకురావాలని యోచిస్తోందని తెలిపారు.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతి నుంచి కేంద్ర ప్రభుత్వం పలు ఐటమ్స్పై పన్ను రేటును తగ్గిస్తూ వచ్చింది. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 14.4 శాతం నుంచి 11.6 శాతానికి దిగొచ్చింది. దీంతో వార్షిక ఆదాయం దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గింది. మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమనియన్ సారథ్యంలోని కమిటీ ప్రతిపాదించిన 15.3 శాతం రెవెన్యూ న్యూట్రల్ రేటు ప్రకారం చూస్తే.. ఆదాయం రూ.2.5 లక్షల కోట్ల మేర తగ్గిందని భావించొచ్చు.
ఇకపోతే జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గితే (ఆదాయ వృద్ధి 14 శాతం లోపు ఉంటే) దాన్ని భర్తీ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రానున్న రోజుల్లో రాష్ట్రాలకు కేంద్ర చెల్లించే జీఎస్టీ పరిహారం పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్రం వచ్చే ఏడాది రాష్ట్రాలకు చెల్లించే నెలవారీ పరిహారం రూ.20,000 కోట్లకు పెరగొచ్చనే అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ మొత్తం దాదాపు రూ.13,750 కోట్లుగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం జీరో ట్యాక్స్ కేటగిరిలో ఉన్న వస్తువుల జోలికి వెళ్లకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక ఆదాయం తీసుకువస్తున్న స్లాబులపైనే ప్రభావం ఉండొచ్చు. కేంద్రం జీఎస్టీ రేట్లను మారిస్తే అప్పుడు ఎఫెక్టివ్ జీఎస్టీ రేటు 12.5- 12.75 శాతానికి పెరగొచ్చు. అయితే రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణ ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణనులు హెచ్చరిస్తున్నారు.
గవర్నమెంట్ అధికారులు జీఎస్టీ రేట్ల మార్పుకు సంబంధించి వచ్చే వారం కేంద్రంతో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో ఆదాయం పెంపునకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించడంతోపాటు మూడంచెల జీఎస్టీ విధానం లక్ష్యాలుగా చర్చలు జగనున్నాయి.
రేట్లు మారితే వేటిపై ప్రభావం?
ఎకానమీ క్లాస్ ఎయిర్ ట్రావెల్, ఫస్ట్/సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్ ట్రావెల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పిజ్జా బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, సిల్క్, క్రూయిజ్ ట్రావెల్, టూర్ సర్వీసెస్, ఔట్డోర్ కేటరింగ్, రెస్టారెంట్స్ వంటి వాటివి ఎక్కువ పన్ను రేటు స్లాబులోకి మారొచ్చు.
ఫోన్లు ప్రియం?
అలాగే మొబైల్ ఫోన్స్, బిజినెస్ క్లాస్ ఎయిర్ ట్రావెల్, ప్రభుత్వ లాటరీలు, ఖరీదైన పెయింటింగ్స్, రూ.5,000 నుంచి రూ.7,5000 మధ్యలో ఉన్న హోటల్ రూమ్స్ వంటివి కూడా అధిక ట్యాక్స్ స్లాబులోకి వెళ్లిపోవచ్చు. దీంతో వీటి ధరలు పెరగొచ్చు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.