యాప్నగరం

జీఎస్టీ సరికొత్త విప్లవం: రాష్ట్రపతి

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జీఎస్టీని ఆవిష్కరించారు.

TNN 1 Jul 2017, 1:32 am
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జీఎస్టీని ఆవిష్కరించారు. జీఎస్టీ ఆవిష్కరణకు ముందు కేంద్ర అరుణ్ జైట్లీ, ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగించారు. భారత ఆర్థిక రంగంలో జీఎస్టీ సరికొత్త విప్లవమని ప్రణబ్ అభివర్ణించారు. ఇప్పటి నుంచి ఒకే దేశం, ఒకే పన్ను అమల్లోకి వస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం జీఎస్టీకి పునాది పడిందని, ఈ పన్ను విధానం రూపకల్పనలో తన పాత్ర ఉందని చెప్పారు.
Samayam Telugu gst a tribute to maturity of our democracy pranab mukherjee
జీఎస్టీ సరికొత్త విప్లవం: రాష్ట్రపతి


2002లో జీఎస్టీ రూపకల్పన ప్రారంభమైందని ప్రణబ్ గుర్తు చేశారు. 2006-07 బడ్జెట్‌ ప్రసంగంలో జీఎస్టీ ప్రతిపాదన చేశామన్నారు. ఇది పన్ను విధానంలో అత్యంత సమగ్రతతో కూడుకున్నదని తెలిపారు. 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ వేశామని, జీఎస్టీపై ప్రథమ ముసాయిదా ఇచ్చింది తామేనని గుర్తు చేశారు. 2011-12లో స్వయంగా తానే మంత్రుల కమిటీతో చర్చలు జరిపానని వివరించారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ కోసం కృషి చేశానన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం జీఎస్టీ కౌన్సిల్‌ ఎంతో శ్రమించిందని ప్రణబ్ కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.