యాప్నగరం

GST బాదుడు.. మరో నాలుగేళ్లు ఆ సెస్‌లు భరించాల్సిందే!

కరోనా కాలంలో రాష్ట్రాలకు తలెత్తిన రెవెన్యూ నష్టాల కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగ్జరీ వస్తువులపై విధిస్తోన్న జీఎస్టీ పరిహారాల సెస్‌ను మరో నాలుగేళ్లు పొడిగించింది. దీంతో ఈ పరిహారాల సెస్ బాదుడును మరో నాలుగేళ్లు కస్టమర్లు భరించాల్సిందే. ఈ నెల చివరితో సెస్ వసూళ్లు ముగుస్తోన్న సమయంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 26 Jun 2022, 1:05 pm

ప్రధానాంశాలు:

  • లగ్జరీ వస్తువులపై మరో నాలుగేళ్లు సెస్‌లు విధింపు
  • మార్చి 2026 వరకు జీఎస్టీ పరిహారాల సెస్ పొడిగింపు
  • నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
  • కరోనా కాలంలో రాష్ట్రాలకు రెవెన్యూ లాస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GST compensation cess on luxury items
లగ్జరీ వస్తువులపై జీఎస్టీ పరిహారాల సెస్‌ పొడిగింపు
లగ్జరీ వస్తువులపై విధిస్తోన్న జీఎస్టీ సెస్‌ను మరో నాలుగేళ్లు భరించాల్సిందే. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారాల సెస్‌ను 31 మార్చి 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సెస్‌ల వసూళ్లు ఈ నెల చివరితో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్ల పాటు వీటి సేకరణను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా కాలంలో రాష్ట్రాలు తీవ్ర లిక్విడిటీ సమస్యను ఎదుర్కొన్నాయి. కరోనా కాలంలో రాష్ట్రాలు ఎదుర్కొన్న రెవెన్యూ నష్టాలను ఈ సెస్‌లు పూరించలేకపోయాయి.
రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నోటిఫై చేసిన జీఎస్టీ(లెవీ కాలం, సెస్ కలెక్షన్) నిబంధన ప్రకారం, జీఎస్టీ సెస్ విధింపు, వసూళ్ల కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల మేరకు ఈ సెస్ పొడిగింపును చేపట్టింది. దీంతో లగ్జరీ, డీమెరిట్ గూడ్స్‌పై విధించే పరిహారాల సెస్‌ను మార్చి 2026 వరకు చేపట్టనుంది. ఇలా సేకరించే సెస్‌ను జీఎస్టీ రెవెన్యూ నష్టం కోసం రాష్ట్రాలకు పరిహారంగా అందించేందుకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనుంది.

సెస్ కలెక్షన్లు తగ్గిపోవడంతో.. రాష్ట్రాలకు రెవెన్యూ నష్టాలను పూరించేందుకు 2020-21లో రూ.1.1 లక్షల కోట్లను, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుంది. 2021-22లో ఈ బారోయింగ్స్‌కు సంబంధించిన రూ.7,500 కోట్ల వడ్డీలను తిరిగి చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. 2023-24 నుంచి ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ పేమెంట్లు మార్చి 2026 వరకు చెల్లించాలి. దీంతో పరిహారాల సెస్ విధింపును 2026 వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : వేతన జీవులపై భారీగా పన్నులు పెంచిన ప్రభుత్వం.. బాదుడే బాదుడు!

Also Read : లక్షకు రూ.2 లక్షలు.. కనీస పెట్టుబడి రూ.1000.. ఈ పోస్టాఫీసు స్కీమ్ గురించి మీరూ తెలుసుకోండి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.