యాప్నగరం

నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్.. జీఎస్‌టీ తగ్గింపు.. ధరలు తగ్గేవి ఇవే!

కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.

Samayam Telugu 12 Jun 2021, 4:29 pm

ప్రధానాంశాలు:

  • కేంద్రం తీపికబురు
  • కీలక నిర్ణయం
  • జీఎస్‌టీ తగ్గింపు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu nirmala sitharaman
కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జీఎస్‌టీ కౌన్సిల్ పలు ప్రొడక్టులపై జీఎస్‌టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బిపాప్ మెషీన్స్, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ వంటి వాటిపై జీఎస్‌టీ తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
వీటిపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ 44వ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.

అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే మెడిసిన్స్‌పై ఎలాంటి ట్యాక్స్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై 5 శాతం జీఎస్‌టీ కొనసాగుతుందని వెల్లడించింది. కాగా జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని, అవసరం అయితే పొడిగించే అవకాశముందని వివరించింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.