యాప్నగరం

మనీ ట్రాన్స్‌ఫర్‌పై ఎస్‌బీఐ కొత్త బాదుడు..

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌) మనీ ట్రాన్సఫర్లలో..

TNN 11 Jul 2017, 5:44 pm
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌) మనీ ట్రాన్సఫర్ ఛార్జీల్లో మార్పులు చేసింది. జీఎస్టీ నేపథ్యంలో కొత్త చార్జీలను ప్రకటించింది. మారిన నిబంధనల ప్రకారం వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ.5 + జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ. 15 + జీఎస్టీ వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu gst effect sbi revises imps money transfer charges
మనీ ట్రాన్స్‌ఫర్‌పై ఎస్‌బీఐ కొత్త బాదుడు..


జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానంలో.. బ్యాంకింగ్‌ సేవలకు గాను జీఎస్టీని 18 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నగదు బదిలీ సేవలకు చార్జీలను మార్పు చేసినట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్వీటర్‌ ద్వారా తెలిపింది.
SBI revises IMPS charges. Below are the revised rates. pic.twitter.com/zhV1dOV4ra — State Bank of India (@TheOfficialSBI) July 10, 2017
మొబైల్‌ ఫోన్లు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదును తక్షణమే బెనిఫిషియరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసే వెసులుబాటును ‘ఐఎంపీఎస్‌ సర్వీస్’ అంటారు. సెలవు రోజులు సహా 24 x 7 సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.