యాప్నగరం

జీఎస్టీ వస్తే.. ఫోన్ బిల్లు మోతే!

జూలై 1 నుంచి మీ ఫోన్ బిల్లుల మోత మరింత ఎక్కువ కానుంది. అలాగే కొత్త ఫోన్ కొనాలన్నా ఇప్పటి కంటే ఎక్కువ చెల్లించాల్సిందే.

TNN 20 May 2017, 3:56 pm
జూలై 1 నుంచి మీ ఫోన్ బిల్లుల మోత మరింత ఎక్కువ కానుంది. అలాగే కొత్త ఫోన్ కొనాలన్నా ఇప్పటి కంటే ఎక్కువ చెల్లించాల్సిందే. ఈ మేరకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేసింది. ఇప్పటి వరకు 15 శాతంగా ఉన్న టెలీకాం సేవల పన్నును 18 శాతానికి పెంచారు. అంటే ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే వినియోగదారుడు మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Samayam Telugu gst effect your phone bill goes up from july
జీఎస్టీ వస్తే.. ఫోన్ బిల్లు మోతే!


ఒకవేళ మీ నెలసరి బిల్లు రూ. 1000 అయితే దానిపై రూ. 30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రీపెయిడ్ యూజర్లయితే.. రూ. 100 రీచార్జ్ చేసుకుంటే సుమారు రూ. 82 టాక్‌టైం వస్తుంది. గతంలో ఇది రూ. 85గా ఉండేది. అయితే టెలీకాం సేవలపై పన్నను పెంచడం పట్ల ఆ రంగానికి చెందిన నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీని వల్ల వినియోగదారులతో పాటు డిజిటల్‌ చెల్లింపులపైనా ప్రభావం ఉంటుందని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎం మాథ్యూస్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. జీఎస్టీ అమలులోకి వస్తే గాడ్జెట్స్ ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, మానిటర్లు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాల ధరలు పెరగనున్నాయి. స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటి వరకు ఉన్న 4-5 శాతం పన్ను జీఎస్టీ రాకతో 12 శాతానికి పెరగనుంది. అలాగే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై కూడా పన్నును 18 శాతానికి పెంచారు. ఇక ప్లాస్మా, 3డీ వంటి పెద్ద టీవీలు.. మానిటర్లు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాలపై పన్నును 28 శాతంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.