యాప్నగరం

జీఎస్టీ ఎఫెక్ట్: బంద్..అరుణ్ జైట్లీ దిష్టిబొమ్మల దహనం!

జీఎస్టీ అమలు దినాన్ని పర్వదినంగా పేర్కొన్నా.. కొన్ని వర్గాల నుంచి ఈ పరిణామం పట్ల నిరసనలు

TNN 1 Jul 2017, 8:30 am
ఒకవైపు జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం పండుగలా, చారిత్రక ఘట్టంలా నిర్వహించినా.. అర్ధరాత్రి పార్లమెంటును సమావేశ పరిచి... జీఎస్టీ అమలు దినాన్ని పర్వదినంగా పేర్కొన్నా.. కొన్ని వర్గాల నుంచి ఈ పరిణామం పట్ల నిరసనలు తప్పడం లేదు. జీఎస్టీ అమలును నిరసిస్తూ రోడ్డెక్కాయి వ్యాపార, వాణిజ్య వర్గాలు. ప్రత్యేకించి వస్త్ర వ్యాపారుల నుంచి జీఎస్టీ పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో వారు శుక్రవారం నుంచినే వస్త్ర వ్యాపారులు ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో దుకాణాలను మూసేసి వారు నిరసన వ్యక్తం చేశారు.
Samayam Telugu protests against gst
జీఎస్టీ ఎఫెక్ట్: బంద్..అరుణ్ జైట్లీ దిష్టిబొమ్మల దహనం!


ప్రత్యేకించి ఉత్తరభారతదేశంలో జీఎస్టీపై తీవ్రమైన నిరసన వ్యక్తం అయ్యింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం తో మొదలుకుని కాన్పూర్, అలహాబాద్, ఝాన్సీ,ఘజియాబాద్,వంటి నగరాల్లో వర్తక సంఘాలు రోడ్డు ఎక్కాయి. నిరసన తెలిపాయి. ర్యాలీలు నిర్వహించాయి. దుకాణాలను మూసేయించి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను హోరెత్తించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనల సెగ తగిలింది. అక్కడి ప్రముఖ హోల్ సేల్ మార్కెట్లు మూతబడ్డాయి. పశ్చిమ బెంగాల్ లో వర్త సంఘాలు బంద్ కు పిలుపునిచ్చి నిరసన తెలిపాయి. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ లో కూడా జీఎస్టీపై నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలోనే జరిగాయి. మరి కొన్ని చోట్ల శనివారం బంద్ కు పిలుపునిచ్చారు వర్తకులు. జీఎస్టీ అమలు నుంచి తమ వ్యాపారాలను మినహాయించాలని కొన్ని రంగాల నుంచి విన్నపాలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరికీ మినహాయింపును ఇవ్వలేదు. దీంతో నిరసనలు తప్పడం లేదు. ఆందోళన కారులు కేంద్ర ప్రభుత్వ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీల దిష్టి బొమ్మలను దహనం చేసి తమ ఆగ్రహావేశాలను చాటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.