యాప్నగరం

Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా.. జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ...?

Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఊపందుకుంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున జాతీయ జెండాల కోసం ఆర్డర్లు వచ్చాయి. దీంతో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను అందుకునేందుకు తయారీదారులు ప్రయత్నించారు. రికార్డు సమయంలో 30 కోట్లకు పైగా జాతీయ జెండాలను తయారు చేశారు. అయితే జాతీయ జెండాల అమ్మకాలు పెరగడంతో.. వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందా..? లేదా..? అనే విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ కూడా ఇచ్చింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 14 Aug 2022, 5:04 pm

ప్రధానాంశాలు:

  • 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భారతావని
  • ఊపందుకున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
  • జాతీయ జెండా అమ్మకాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు
  • 20 రోజుల్లో 30 కోట్లకు పైగా జాతీయ జెండాలు తయారీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Har Ghar Tiranga Initiative
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవంతో భారతావని పులకరించిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేస్తూ.. ఆ పోస్టులను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. జాతీయ జెండాను కావాలనుకున్న వారు ఆన్‌లైన్ ద్వారా లేదా పోస్ట్ ఆఫీసు ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే జాతీయ జెండా అమ్మకాలపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వర్తిస్తుందా..? అనే విషయంపై ప్రజలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. జాతీయ జెండాను మెషిన్‌పై తయారు చేసినా లేదా పాలిస్టర్ అయినా కూడా జీఎస్టీ నుంచి జాతీయ జెండాకు మినహాయింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. చేతితో నేసిన జాతీయ జెండాలైన లేదా ఖాదీవి అయిన జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
గతేడాది డిసెంబర్‌లో ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’కి చేపట్టిన సవరణలతో పాలిస్టర్ లేదా మెషిన్‌తో తయారు చేసిన జాతీయ జెండాలైనా.. జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తన ఆఫీసు మెమోరాండంలో స్పష్టతనిచ్చింది. ఫ్లాగ్ కోడ్ 2002కి జాతీయ జెండాల అమ్మకం కట్టుబడి ఉంటుందని, జెండాల అమ్మకానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

Also Read :ఆయన వల్లే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ధనవంతుడిగా మారారంట.. ప్రస్తుతం బిగ్ బుల్ సంపదెంతో తెలుసా..?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాల అమ్మకాలు కూడా ఈసారి పెరిగాయి. 30 కోట్లకు పైగా జాతీయ జెండాలు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో రూ.500 కోట్ల వ్యాపారం వరకు నమోదైందని తెలిసింది. ఈ నేపథ్యంలో జాతీయ జెండాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం 30 కోట్లకు పైగా జాతీయ జెండాను రికార్డు సమయంలో తయారు చేశారు. కేవలం 20 రోజుల్లోనే దేశ ప్రజల నుంచి వెల్లువెత్తిన అనూహ్యమైన డిమాండ్‌ను అందుకున్నారు. పాలిస్టర్, మెషిన్‌పై తయారు చేసిన జాతీయ జెండాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ కింద అనుమతి ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా జెండాల అందుబాటు పెరిగింది. అంతకుముందు కేవలం ఖాదీ లేదా వస్త్రంతో తయారు చేసిన జాతీయ జెండాలను మాత్రమే ఎగరవేసేవారు. ఫ్లాగ్ కోడ్‌లో సవరణలు చేపట్టడంతో.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి అవకాశాలను కూడా పొందారు.

Also Read :రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత.. వైరల్ అవుతున్న బిగ్ బుల్ వీల్‌చెయిర్ డ్యాన్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.