యాప్నగరం

సమ్మె బాట పట్టిన థియేటర్ల ఓనర్స్

జీఎస్టీ పన్ను విధానం అమలుకి నోచుకోవడానికి ముందే వివిధ వ్యాపార రంగాల నుంచి జీఎస్టీపై తీవ్ర అసంతృప్తి

Samayam Telugu 1 Jul 2017, 12:29 am
జీఎస్టీ పన్ను విధానం అమలుకి నోచుకోవడానికి ముందే వివిధ వ్యాపార రంగాల నుంచి జీఎస్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, దీనికితోడు తాజాగా వస్తు సేవల పన్నుపై అదనంగా 30 శాతం మునిసిపల్ ట్యాక్స్ విధించాలని తమిళనాడులోని స్థానిక సంస్థలు పథకరచన చేస్తుండటంపై అక్కడి థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ మండిపడింది. జీఎస్టీ అమలు కారణంగానే తమ వ్యాపారం దివాలా తీసేటట్టుందని తాము ఓవైపు ఆందోళకి గురవుతోంటే, మరోవైపు మున్సిపాలిటీల నుంచి ఈ అదనపు బాదుడు ఏంటి అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు థియేటర్ల యజమానులు.
Samayam Telugu tamilnadu theatres association calls for kollywood theatres bandh
సమ్మె బాట పట్టిన థియేటర్ల ఓనర్స్


ఈ నేపథ్యంలో తమిళనాడులోని మునిసిపల్ సంస్థల తీరుని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని థియేటర్లను సోమవారం నుంచి నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే జీఎస్టీ కారణంగా వర్తించనున్న 28% పన్ను భారాన్నే తట్టుకోలేకపోతాం అని యావత్ సినీరంగం ఆందోళన వ్యక్తంచేస్తోంటే, మళ్లీ ఈ మునిసిపల్ సంస్థల అదనంగా 30 శాతం మునిసిపల్ పన్నును విధించడం ఎంతమేరకు సబబు అని ప్రశ్నించారు. ఈ కారణంగానే సోమవారం నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు స్పష్టంచేశారు. మరి తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.