Union Budget 2020-21: Top Five Things On Common Man's Wish List
మోదీ వరాలు! బడ్జెట్ 2020లో పాంచ్ పటాకా?
కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జె్ట్ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగిపోయింది. డిమాండ్ పడిపోయింది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయి నడిరోడ్డ మీదకు వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మోదీ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది.
Samayam Telugu24 Jan 2020, 12:08 pm
కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జె్ట్ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగిపోయింది. డిమాండ్ పడిపోయింది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయి నడిరోడ్డ మీదకు వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మోదీ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది.
ఊరటకు ఛాన్స్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరికి ఊరట కలిగించేందుకు ఈసారి బడ్జెట్లో పన్ను సంబంధింత కీలక ప్రకటనలు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అవేంటో చూద్దాం.
1. పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే అధిక పన్ను శ్లాబ్లో ఉన్న వారు 5 శాతం పన్ను తగ్గింపు ఆశిస్తున్నారు.
2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్లు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిమిట్ను మరింత పెంచాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ రీపేమెంట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందొచ్చు.
3. మధ్యతరగతి ప్రజలను వైద్య ఖర్చులు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఇటీవల కాలంలో అనారోగ్యానికి వైద్యం చేయించుకోవాలంటే జేబుకు చిల్లు పడుతోంది. వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అందువల్ల వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితిని రూ.25,000 నుంచి రూ.35,000కు పెంచాలని మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఆశిస్తున్నారు.
4. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు కలిగించే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 2011లో ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. కానీ తర్వాత దీన్ని విరమించుకున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.లక్ష వరకు పన్ను మినహాయింపు లభించేది.
5. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయంపై లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (దీర్ఘకాల మూలధన లాభాలు) ట్యాక్స్ లిమిట్ను పెంచాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. డిమాండ్లు ఎలా ఉన్నా గవర్నమెంట్ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బడ్జెట్ రోజు తెలుస్తుంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.