యాప్నగరం

పెట్రోల్, డీజిల్ ధరలను మేం నిర్ణయించడం లేదంటున్న కేంద్రం.. రాష్ట్రాలకు ఆ సూచన.. నేటి ధరలు ఇలా

Petrol Diesel Rates Hyderabad | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఫ్యూయెల్‌ రేట్లపై వ్యాట్ తగ్గించాలని కోరుతోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రాలకు సూచన చేశారు. నాన్ బీజేపీ రూలింగ్ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని తెలిపారు. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగానే కొనసాగాయి. హైదరాబాద్‌ సహా ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.

Authored byKhalimastan | Samayam Telugu 24 Apr 2022, 8:17 am

ప్రధానాంశాలు:

  • పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ఏమంటోందంటే
  • ఆయిల్ కంపెనీల రేట్ల పెంపుతో సంబంధం లేదంటున్న ప్రభుత్వం
  • కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచన
  • తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయెల్ రేట్లు నిలకడగానే ఉన్నాయి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Petrol: పెట్రోల్
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాట్ తగ్గించని రాష్ట్రాలకు ముఖ్య సూచన చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) VAT ఇప్పుడైనా తగ్గించాలని కోరారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్రం మంత్రి ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేశారు. ఫ్యూయెల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా ద్రవ్యోల్బణం మీద పడుతోంది. ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఇతర కమొడిటీ ధరలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అంతిమంగా కన్సూమర్లపై ఎఫెక్ట్ ఉంటోంది.
నాన్ బీజేపీ రూలింగ్ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ఈయన కోరారు. తద్వారా ప్రజలకు ఊరట కలిగించాలన్నారు. వ్యాట్‌లో 50 శాతం మేర కోత విధించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుంకాలను తగ్గించిందని గుర్తు చేశారు. వ్యాట్ ఎక్కువగా కొనసాగిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రాన్ని ఎలా విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 మేర తగ్గాయి. తర్వాత పలు రాష్ట్రాలు ఇదే దారిలో నడిచాయి. వీటిల్లో ఎక్కువ బీజేపీ అధికార రాష్ట్రాలే ఉన్నాయి.

కాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 137 రోజులు స్థిరంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం ఇందుకు కారణం. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఇంధన ధరల బాదుడు ప్రారంభమైంది. మార్చి 22 నుంచి పెంపు ప్రారంభం అయ్యింది. లీటరుకు ధరలు రూ.10 మేర పైకి చేరాయి. అయితే హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు కేంద్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు.

కాగా ఏప్రిల్ 24న కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఏపీ గుంటూరులో పెట్రోల్ ధర రూ.121.26 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.106.87 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.119.47గా, రూ.105.47గా ఉన్నాయి. వరంగల్‌లో రేట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ రేటు రూ.118.97 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ.105 వద్ద కొనసాగుతోంది.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.