CNG Price: మోదీ సర్కార్ గుడ్న్యూస్.. భారీగా తగ్గనున్న 'సీఎన్జీ' గ్యాస్ ధర.. కేబినెట్ ఆమోదం!
CNG Price: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శుభవార్త అందించింది. సహజ వాయువు ధర నిర్ణయించే సూత్రాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రి వర్గం గురువారం ఆమోద ముద్ర వేసింది. అలాగే సీఎన్జీ ధరకు పరిమితి విధించేందుకు ఓకే చెప్పింది. దీంతో కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 10 శాతం మేర తగ్గనుంది. పైపు ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధర కూడా తగ్గనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
CNG Price: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహజ వాయువుకు ధర నిర్ణయించే సూత్రాన్ని (Natural Gas Pricing Formula) సవరించేందుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. అలాగే ధరకు పరిమితి విధించేందుకు నిర్ణయించింది. ధర నిర్ణయించే సూత్రాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన క్రమంలో కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్ (PNG) ధర 10 శాతం మేర తగ్గనుంది. విదేశాల్లోని నేచురల్ గ్యాస్ (cng gas price in hyderabad) ధరలను బట్టి కాకుండా ఇకపై దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి ధరలు నిర్ణయించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.
ఏడాది కాలంలోనే సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ ధరల నియంత్రణకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ధరల పరిమితి రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఏప్రిల్ 1న భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలో 10 శాతం ఏపీఎం గ్యాస్ ధరను నిర్ణయించనున్నారు. అయితే అటువంటి ధర ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 6.5 డాలర్ల వద్ద పరిమితం చేయబడుతుంది. ప్రస్తుతం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకి 8.57డాలర్లుగా ఉంది.
కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్ ధరలు తగ్గడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు సీఎన్జీ గ్యాస్ ఆధారిత వాహనదారులకు సైతం ఊరట లభిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వంటి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం గమనార్హం. ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. అంతరిక్ష విధానంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన భారత అంతరిక్ష విధానం -2023కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆధునిక స్పేస్ టెక్నాలజీపై ఇస్రో దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయంపై మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో భారత్ వాటా ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువగానే ఉంది. ఇకపై అది 10 శాతానికి పెరిగేందుకు నూతన పాలసీ ఉపయోగపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ సైతం పేర్కొన్నారు. మరోవైపు.. మహారాష్ట్రలోని హింగోలిలో రూ.2,600 కోట్ల ఖర్చుతో లేజర్ ఇంటెర్పెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఏడాది కాలంలోనే సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ ధరల నియంత్రణకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ధరల పరిమితి రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఏప్రిల్ 1న భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలో 10 శాతం ఏపీఎం గ్యాస్ ధరను నిర్ణయించనున్నారు. అయితే అటువంటి ధర ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 6.5 డాలర్ల వద్ద పరిమితం చేయబడుతుంది. ప్రస్తుతం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకి 8.57డాలర్లుగా ఉంది.
కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్ ధరలు తగ్గడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు సీఎన్జీ గ్యాస్ ఆధారిత వాహనదారులకు సైతం ఊరట లభిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వంటి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం గమనార్హం. ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. అంతరిక్ష విధానంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన భారత అంతరిక్ష విధానం -2023కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆధునిక స్పేస్ టెక్నాలజీపై ఇస్రో దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయంపై మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో భారత్ వాటా ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువగానే ఉంది. ఇకపై అది 10 శాతానికి పెరిగేందుకు నూతన పాలసీ ఉపయోగపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ సైతం పేర్కొన్నారు. మరోవైపు.. మహారాష్ట్రలోని హింగోలిలో రూ.2,600 కోట్ల ఖర్చుతో లేజర్ ఇంటెర్పెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
- Read Latest Business News and Telugu News