యాప్నగరం

Cooking Oil: శుభవార్త.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు.. లీటర్‌కు ఎంత దిగొచ్చాయంటే?

Cooking Oil: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా ఆయిల్ కంపెనీలు వంట నూనె ధరల్ని తగ్గించాయి. తాజాగా ధారా బ్రాండ్‌పై విక్రయిస్తున్న వంట నూనెల గరిష్ట విక్రయ ధరను భారీగా తగ్గించింది మదర్ డెయిరీ. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 5 May 2023, 11:12 am
Cooking Oil: అంతర్జాతీయ కమొడిటీ ధరలకు అనుగుణంగా ఆయిల్ ధరల్ని తగ్గించాలని.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయా కంపెనీలకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రానున్న 3 వారాల్లోగా తక్కువ రేటులో ఆయిల్ సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ధారా బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయిస్తున్న మదర్ డెయిరీ ఆయిల్ రేట్లను భారీగా తగ్గించింది. వంట నూనె గరిష్ట విక్రయ ధరను లీటర్‌పై రూ.15 నుంచి 20 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది మదర్ డెయిరీ. తక్షణమే ఈ ధరల తగ్గింపు అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. ధరలు ఇప్పటికే తగ్గగా.. సవరించిన MRP ధరలతో ప్యాకెట్లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దీంతో ఇతర కంపెనీలు కూడా అతి త్వరలోనే ఆయిల్ ధరల్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu OIL PRICE


ఇక అంతర్జాతీయ ఆయిల్ ధరలకు అనుగుణంగా.. వంట నూనెల ధరల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, వంటనూనెల పరిశ్రమ సంఘానికి (SEA) ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మదర్ డెయిరీ తాజాగా రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Kashmir Tour: విమానంలో కశ్మీర్ ట్రిప్.. తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ అద్భుత ఆఫర్.. ప్యాకేజీ ఫుల్ డీటెయిల్స్ ఇవే..

ఇక తాజా మార్పుల ఫలితంగా.. ధారా రిఫైన్డ్ సోయాబీన్ నూనె లీటర్ ప్యాకెట్ గరిష్ట విక్రయ ధర ఇప్పుడు రూ.170 నుంచి రూ.150కి దిగొచ్చింది. రైస్ బ్రాన్ నూనె MRP రూ.190 నుంచి రూ.170కి తగ్గింది. ఇక పొద్దుతిరుగుడు నూనె ధర రూ.170 నుంచి రూ.165 కు పడిపోయింది. వేరుసెనగ నూనె రేటు రూ.255 నుంచి రూ.240 కి తగ్గింది. వాస్తవం చెప్పాలంటే.. ఇంత కంటే బాగా తక్కువకే విక్రయాలు జరుగుతున్నాయి. MRP ని తగ్గిస్తున్నందున, ఆ మేరకు ప్రయోజనం ఇప్పుడు వినియోగదారులకు దక్కాల్సి ఉంది.



ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. అయితే.. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఇక్కడి కంపెనీలు.. రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి. తాజాగా ప్రభుత్వం సూచనలు నేపథ్యంలో ధరల్ని తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వంట నూనెల విక్రయంలో ముందంజలో ఉన్న అదానీ విల్మర్ సహా ఇతర కంపెనీలు కూడా వంట నూనెల ధరల్ని తగ్గించనున్నాయి. ఇవి ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనేది మాత్రం స్పష్టత లేదు.


రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.