యాప్నగరం

Today Petrol Prices: రూ.79కే డీజిల్, రూ.84కే పెట్రోల్.. దేశంలో చీపెస్ట్ ఫ్యూయెల్ రేట్లు ఇవే!

Fuel Rates In India: పెట్రోల్ ధరలు ఈరోజు కూడా నిలకడగానే ఉన్నాయి. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. దేశవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే ట్రెండ్ నడిచింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇది వాహనదారులకు ప్రతికూల అంశం అని చెప్పుకోవచ్చు. క్రూడ్ ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పైకి కదిలే ఛాన్స్ ఉంటుంది.

Authored byKhalimastan | Samayam Telugu 25 May 2022, 7:56 am

ప్రధానాంశాలు:

  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి
  • ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది
  • తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యూయెల్ రేట్లలో మార్పు లేదు
  • హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu petrol rates ap ts
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Rate In Hyderabad: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకేలా ఉండవు. రాష్ట్రం ప్రాతిపదికన ధరలు మారుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేసింది. ఈ క్రమంలో దేశంలో అత్యంత ఖరీదుకు పెట్రోల్ (Today Petrol Rate), డీజిల్ ఎక్కడ లభిస్తున్నాయో తెలుసుకుందాం. అలాగే తక్కువ ధరలు ఎక్కడ ఫ్యూయెల్ లభిస్తుందో చూద్దాం. దేశంలో మహరాష్ట్రలోని పర్బానీలో పెట్రోల్ రేటు (Petrol Price Today) రూ. 114.38గా ఉంది. ఇదే ఖరీదైన పెట్రోల్. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో డీజిల్ ధర రూ. 100.3గా ఉంది. ఇది ఖరీలైన డీజిల్. అలాగే పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రేటు రూ. 84గా ఉంది. తక్కువ ధరకు లభిస్తున్న పెట్రోల్ ఇదే. అలాగే ఇక్కడ డీజిల్ రేటు కూడా రూ. 79.74గా ఉంది. దేశంలో డీజిల్ రేటు ఇక్కడ తక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు
ఏపీ, తెలంగాణలో మే 25న ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. పెట్రోల్ రేటు రూ. 109.64 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రేటు రూ. 97.8 వద్ద ఉంది. గుంటూరులో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 111.74గా, రూ. 99.49గా ఉన్నాయి. వరంగల్‌లో పెట్రోల్ కోసం రూ. 109.14, డీజిల్ కోసం రూ. 97.33 చెల్లించుకోవాలి. వైజాగ్‌లో ఫ్యూయెల్ రేట్లు రూ. 110.46 వద్ద, రూ.98.25 వద్ద కొనసాగుతున్నాయి.

Also Read: undefined

శ్రీలంకకు భారత్ సాయం
ఆర్థిక కష్టాల్లో చతికిలపడిపోయిన శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ ఫ్యూయెల్ సాయం అందించింది. దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్‌ను శ్రీలంకకు పంపింది. దీని కన్నా ముందు భారత్ 40 వేల మెట్రిక్ టన్నులు డీజిల్ కూడా శ్రీలంకు పంపిన విషయం తెలిసిందే. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని అందరికి తెలుసు. అందుకే భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా భారత్ గత నెలలో 500 మిలియన్ డాలర్లను శ్రీలంకకు అందించింది.

క్రూడ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.04 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 111.75 డాలర్లకు చేరింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడాయిల్ విషయానికి వస్తే.. 1.02 శాతం పెరిగింది. దీంతో ఈ ముడి చమురు రేటు బ్యారెల్‌కు 110.91 డాలర్లకు ఎగసింది.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.