యాప్నగరం

ఒకవైపు భారత్ బంద్.. అయినా పెరిగిన ఇంధన ధరలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.90కి మరింత చేరువైంది.

Samayam Telugu 10 Sep 2018, 11:40 am
ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఒక వైపు దేశవ్యాప్త బంద్ కొనసాగుతుండగా.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం (సెప్టెంబరు 10) పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.80.73, రూ. 72.83కి చేరాయి. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో 23 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.88.12 ఉండగా.. అంతే మొత్తంలో పెరిగిన డీజిల్ ధర రూ.77.32 గా ఉంది.
Samayam Telugu bandh2


దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం నాటి పెట్రోలు, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి...
* చెన్నైలో పెట్రోలు ధర 25 పైసలు పెరిగి రూ.83.91 ఉండగా.. డీజిల్‌ ధర 23 పైసలు పెరిగి రూ.76.98 కి చేరింది.
* కోల్‌కతాలో పెట్రోలు ధర 22 పైసలు పెరిగి రూ.83.61 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 23 పైసలు పెరిగి రూ.75.68 కి చేరింది.
* బెంగళూరులో పెట్రోలు ధర 24 పైసలు పెరిగి రూ.83.36 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 23 పైసలు పెరిగి రూ.75.18 కి చేరింది.
* హైదరాబాద్‌లో పెట్రోలు ధర 25 పైసలు పెరిగి రూ.85.60 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 24 పైసలు పెరిగి రూ.79.22 కి చేరింది.
Related Article: పెట్రో ధరలపై రాజస్థాన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.