యాప్నగరం

Petrol Price: ఇంధన ధరలకు రెక్కలు.. జీవనకాల గరిష్ఠానికి పెట్రోలు

ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

Samayam Telugu 1 Sep 2018, 10:27 am
ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం (ఆగస్టు 30) జీవనకాల గరిష్ఠానికి చేరిన డీజిల్‌.. శుక్రవారం (ఆగస్టు 31) మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు పెట్రోల్‌ కూడా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగి రూ.78.52కి చేరింది, లీటర్‌ డీజిల్ ధర 28 పైసలు పెరిగి 70.21కి చేరింది.
Samayam Telugu petrol-bccl


దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లోనూ డీజిల్‌ ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది మే నెలలోనే ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.78.43గా ఉంది. తాజా పెంపుతో ఆ రికార్డును దాటి పెట్రోల్‌ ధర రూ.78.52కి చేరి జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.

మెట్రో నగరాల్లో శుక్రవారం నాటి ఇంధన ధరలు
* ఢిల్లీలో పెట్రోలు ధర రూ.78.52కి చేరగా.. డీజిల్ ధర రూ.70.21గా ఉంది.
* ముంబయి పెట్రోలు ధర రూ. 85.93గా, డీజిల్ ధర రూ.74.54గా ఉంది.
* కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 81.44గా, డీజిల్ ధర రూ. 73.06గా ఉంది.
* చెన్నైలో లీటర్ పెట్రోలు ధర 81.58గా, డీజిల్ ధర రూ.74.18గా ఉంది.
Read also పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు జీఎస్టీ ప‌రిధిలోకి వ‌చ్చేనా?
పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చకుండా తమ జేబులకు చిల్లు పెడుతున్నారంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.