యాప్నగరం

పెట్రోల్, డీజిల్ ధరలు. నెల రోజులకు పైగా ఎక్కడి రేట్లు అక్కడే!

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు కాస్త రిలీఫ్ ఇస్తున్నాయి. గత నెల రోజులకు పైగా ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ విషయం ఉదయం ఆరు గంటలకు ఆయిల్ కంపెనీలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ రేట్ల డేటాలో తెలిసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఎక్కడా ధరలు మారలేదు. కానీ కొన్ని ప్రాంతాలలో ధరలలో మార్పులున్నాయి. అక్కడ స్థానిక పన్నుల ఆధారంగా ధరలలో మార్పు ఉంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 11 May 2022, 9:52 am

ప్రధానాంశాలు:

  • వరుసగా 35 రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరం
  • ధరల డేటా విడుదల చేసిన ఆయిల్ కంపెనీలు
  • స్థానిక పన్నుల బట్టి కొన్ని ప్రాంతాలలో ధరలలో మార్పు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Petrol Diesel Rates
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా మారలేదు. వరుసగా 35 రోజులుగా ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారానికి చెందిన పెట్రోల్, డీజిల్ రేట్ల డేటాను విడుదల చేశాయి. ఈ డేటాలో లీటరు పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.105 పలుకుతోంది. అలాగే ముంబైలో ఈ ధర రూ.120గా ఉంది. డీజిల్ ధర ఢిల్లీ, ముంబైలో రూ.96.67గా, రూ.104.77గా ఉన్నాయి. ఇక మన హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గానే, లీటరు డీజిల్ ధర రూ.105.49గానే పలుకుతున్నాయి. ఏపీలో డీజిల్ రేట్లు రూ.106 మధ్యలో నుంచి రూ.107 పైన రికార్డవుతున్నాయి. ఈ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. అలాగే పెట్రోల్ ధరలు కూడా లీటరు రూ.120 పై నుంచి రూ.121 పైన ఉన్నాయి. రాష్ట్రాలలో స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరలలో మార్పు ఉంటోంది.
అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆ సమయంలో దేశీయంగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. ఈ ధరలు స్థిరంగా ఉండటం వల్ల ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రూ.19 వేల కోట్ల రెవెన్యూలను కోల్పోయాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ వెల్లడించింది. ఆ సమయంలో క్రూడాయిల్ ధర అంతర్జాతీయంగా బ్యారల్ 82 డాలర్ల నుంచి 120 డాలర్లకు ఎగిసింది.

Also Read : స్విగ్గీ ‘సూపర్ డైలీ’ క్లోజ్.. ఇక నుంచి పాలు, పెరుగు నో డెలివరీ
అయితే కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు లీటరు డీజిల్‌పై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, లీటరు పెట్రోల్‌పై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు ధరలు పెంచాల్సి ఉందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశీయంగా స్థిరంగా ఉన్న ధరలు.. ఆ తర్వాత కొద్ది రోజులకు బాదుడు షురూ చేశాయి. వరుసగా రెండు వారాల పాటు ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో లీటరు పెట్రోల్, డీజిల్ ధరపై రూ.10 మేర ధర పెరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి దాకా ధరలు స్థిరంగా ఉన్నాయి. భారత్ తన ఆయిల్ అవసరాలలో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ధరల ప్రకారం ఈ రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉంటోంది. ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారల్ 102 డాలర్ల వద్ద నమోదవుతోంది.

Also Read : EPSలో భారీ మార్పులు.. పెరగనున్న పెన్షన్ మొత్తాలు

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.