పెట్రోల్ రూ.34.. డీజిల్ రూ.29..
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్ రేటు గత రెండేళ్ల కాలంలో భారీగా పెరిగింది. ఏకంగా రూ.34 మేర పైకి కదిలింది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.29 మేర పెరిగింది.
Samayam Telugu 25 Oct 2021, 5:28 am
ప్రధానాంశాలు:
- రెండేళ్లలోనే భారీగా పెరిగిన ఇంధన ధరలు
- పెట్రోల్ రూ.34 పైకి
- డీజిల్ రేటు రూ.29 జంప్
పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో కేవలం వాహనదారులపై మాత్రమే కాకుండా సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే దేశంలో చాలా చోట్లు పెట్రోల్ ధర రూ.120 దాటేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో రూ.110 పైకి కదిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండేళ్ల కాలంలో ఏ స్థాయిలో పెరిగియో తెలిస్తే.. షాక్ అవాల్సిందే. పెట్రోల్ రేటు ఏడాదిలో 32 శాతం పెరిగింది. అదే రెండేళ్లలో అయితే 46 శాతం పైకి కదిలింది. గత నెలలో పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.6 మేర పెరిగింది.
గత రెండేళ్ల కాలంలో దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.34 పెరిగింది. ఇక డీజిల్ రేటు విషయానికి వస్తే.. లీటరుకు రూ.29.50 పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సహా దేశీయంగా పన్నుల బాదుడు కారణంగా ధరలు ఈ స్థాయిలో పెరిగాయి.
Also Read: undefined
Also Read: undefined
గత రెండేళ్ల కాలంలో దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.34 పెరిగింది. ఇక డీజిల్ రేటు విషయానికి వస్తే.. లీటరుకు రూ.29.50 పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సహా దేశీయంగా పన్నుల బాదుడు కారణంగా ధరలు ఈ స్థాయిలో పెరిగాయి.
Also Read: undefined
Also Read: undefined