యాప్నగరం

Latest Petrol Rates: పెట్రోల్ బంక్ డీలర్ల సమ్మెపై కీలక నిర్ణయం.. నేటి ఫ్యూయెల్ రేట్లు ఇలా!

Petrol Rate Today: పెట్రోల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో ఇంధన ధరల్లో ఈరోజు కూడా మార్పు లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. దీంతో క్రూడ్ ఆయిల్ రేట్లు 115 డాలర్ల పైకి చేరాయి. మరోవైపు పెట్రోల్ బంకుల డీలర్లు సమ్మె నిర్ణయాన్ని విరమించారు. పెట్రోలియం శాఖ అధికారులతో మీటింగ్ అనంతరం ఈ ప్రకటన చేశారు.

Authored byKhalimastan | Samayam Telugu 28 May 2022, 8:05 am

ప్రధానాంశాలు:

  • నిలకడగానే కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు
  • అయితే భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
  • 1 శాతానికి పైగా ర్యాలీ చేసిన క్రూడాయిల్
  • పెట్రోల్ బంకులు సమ్మె అంశంపై కీలక నిర్ణయం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu petrol diesel rates
నేటి పెట్రోల్ , డీజిల్ ధరలు
Petrol Price Today: ఆల్ ఇండియా పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ (ఏఐపీడీఏ) మే 27 కీలక ప్రకటన చేసింది. తన సభ్యులను పెట్రోల్ బంకులను మూసివేయవద్దని కోరింది. పెట్రోలియం శాఖ అధికారులతో చర్చలు అనంతరం ఏఐపీడీఏ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, మహరాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బిహార్, తమిళ నాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన డీలర్స్ అసోసియేషన్స్ నో పర్చేజ్ ఆఫ్ ఫ్యూయెల్ డేని గమనిస్తున్నామని పేర్కొన్నాయి. పెట్రోల్ (Petrol Rate), డీజిల్ (Latest Diesel Prices) తక్కువ సరఫరా చేయడం, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వంటి అంశాల్లో డీలర్లు ప్రభుత్వంపై విముఖతతో ఉన్నారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల ఫ్యూయెల్ డీలర్లను కలిగిన ఏఐపీడీఏ మే 27న పెట్రోలియం శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో అధికారులు పెట్రోల్ బంకుల డీలర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూయెల్ డీలర్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఫ్యూయెల్ డీలర్లు ప్రధానంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమిషన్‌ను 5 శాతానికి పెంచాలని, నిర్వహణ వ్యయాలు పెరిగిపోతున్నాయని డిమాండ్ చేస్తున్నారు. డీలర్స్ కమిషన్‌ను ప్రస్తుతం ఐదేళ్ల నాటి ఫార్ములా ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. దీన్ని మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం డీలర్లకు ఢిల్లీలో పెట్రోల్‌పై రూ. 3.78, డీజిల్‌పై రూ. 2.57 కమిషన్ లభిస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ కమిషన్‌లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంటూ వస్తోంది. 2016లో కమిషన్‌ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించాలనే ప్రతిపాదన చేశారు. కానీ ఇది ఇంత వరకు అలానే ఉంది. అమలులోకి రాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు
హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు నిలకడగానే ఉంది. మే 28న ఎలాంటి మార్పు లేదు. రూ. 109.64 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 97.8 వద్ద ఉంది. వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 109.14, రూ. 97.33 వద్ద ఉన్నాయి. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 111.74గా ఉంది. డీజిల్ రేటు రూ. 99.49 వద్ద కొనసాగుతోంది. విశాఖ పట్నంలో పెట్రోల్ రేటు రూ. 110.46 వద్ద, డీజిల్ రేటు రూ. 98.25 వద్ద ఉంది. కర్నూల్‌లో పెట్రోల్ రేటు రూ. 112.1 వద్ద, డీజిల్ రేటు రూ. 99.83 వద్ద ఉన్నాయి.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.