యాప్నగరం

Petrol Price Today: రికార్డు స్థాయికి పెట్రోలు ధరలు.. ముంబయిలో రూ.91 పైనే

ఢిల్లీలో సహజవాయువు ధరలు కూడా పెరగడంతో ప్రస్తుతం రాయితీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.502.4కు చేరింది.

Samayam Telugu 1 Oct 2018, 11:05 am
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించడంతో.. సోమవారం (అక్టోబరు 1) ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.73కి చేరింది. డీజిల్ ధర 30 పైసలు పెరిగి రూ.75.09కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 24 పైసలు పెరిగి రూ.91 రూపాయలకు పైగా చేరింది. అక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.91.08 గా నమోదైంది. డీజిల్ ధర 32 పైసలు పెరిగి 79.72కి చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 88.77, డీజిల్ ధర రూ.81.33 గా ఉంది.
Samayam Telugu petrol


ఢిల్లీలో సహజవాయువు ధరలు కూడా పెరగడంతో ప్రస్తుతం రాయితీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.502.4కు చేరింది. ఆదివారం (సెప్టెంబరు 30) ఒక్కరోజే అక్కడ సిలిండర్‌ ధర రూ.59 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి పెట్రోల్‌ ధరలు 8శాతం పెరగగా, డీజిల్‌ ధరలు 10శాతం పెరిగాయి.

అక్టోబరు 1న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్)డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.83.73 రూ.75.09
ముంబయి రూ.91.08 రూ.79.72
కోల్‌కతారూ.85.53 రూ.76.94
చెన్నైరూ.87.05 రూ.79.40
బెంగళూరు రూ.84.40 రూ.75.48
హైదరాబాద్ రూ.88.77 రూ.81.33

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.