యాప్నగరం

Petrol Price: కొన‌సాగుతున్న పెట్రో మంట‌లు..

చమురు సంస్థలు ఆదివారం (సెప్టెంబరు 30) కూడా పెట్రోలియం ధరలను సవరించాయి. దీంతో పెట్రోల్ 9 పైస‌లు, డీజిల్‌పై 15 పైస‌ల మేర పెరిగింది.

Samayam Telugu 30 Sep 2018, 10:55 am
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించడంతో.. ఆదివారం (సెప్టెంబరు 30) ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 9 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.49కి చేరింది. డీజిల్ ధర కూడా 16 పైసలు పెరిగి రూ.74.69కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 9 పైసలు పెరిగింది. దీంతో ముంబయిలో పెట్రోలు ధర రూ.90.75కు చేరింది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి 79.23కి చేరింది.
Samayam Telugu petrol


ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 88.51, డీజిల్ ధర రూ.81.33 గా ఉంది. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ. 87.86, డీజిల్ రూ. 80.35 గా ఉంది.

సెప్టెంబరు 30న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్)డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.83.49రూ.74.79
ముంబయి రూ.90.84రూ.79.40
కోల్‌కతా రూ.85.30 రూ.76.64
చెన్నైరూ.86.80 రూ.79.08
బెంగళూరు రూ.84.15 రూ.75.17
హైదరాబాద్ రూ.88.51 రూ.81.33
విజయవాడ రూ.87.86 రూ.80.35

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.