యాప్నగరం

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ భారీగా ధరలు తగ్గే అవకాశం..!

Petrol Price: ఈనెల 7వ తేదీ నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతోందనే ప్రచారం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో కొన్నాళ్లుగా ఎలాంటి మార్పులు లేవు. దీంతో తాజాగా.. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై 5న (సోమవారం) ప్రకటన చేసే అవకాశం ఉంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 4 Dec 2022, 9:32 pm

ప్రధానాంశాలు:

  • వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న కేంద్రం
  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం
  • పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తగ్గింపు నిర్ణయం..!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Petrol Prices
పెట్రోల్ ధరలు
Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. కొద్ది కాలంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 మార్చి దాదాపు 27 శాతం వరకు చమురు ధరలు పడిపోయాయి. దీంతో చమురు కంపెనీలు కూడా నష్టాల నుంచి బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో ధరలు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకోనుందని.. మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికి పార్లమెంట్ సమావేశాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈనెల 7 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే తగ్గింపు ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు. ధరలు తగ్గించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

గత కొద్ది నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర్ రూ.109.66 ఉంది. డీజిల్ ధర రూ. 97.82 ఉంది. విజయవాడలో లీడర్ పెట్రోల్ ధర రూ. 111.66 ఉంది. డీజిల్ ధర రూ. 99.43 ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు కనీసం 5 రూపాయలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వాహనదారులపై భారం తగ్గే అవకాశం ఉంది. అయితే.. లీటరుకు 5 రూపాయలే తగ్గిస్తారా.. ఇంకా ఎక్కువ తగ్గిస్తారా అన్నది.. కేంద్ర ప్రకటన తర్వాతే తేలనుంది.
Read Latest Business News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.