యాప్నగరం

LPG Cylinder: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. ఏడాదికి 12.. బడ్జెట్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. లక్కీ ఛాన్స్!​​

LPG Cylinder: ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల ధర చుక్కలు చూపిస్తోంది. పలు రాష్ట్రాల్లో రూ.1000కిపైనే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ కూడా రావట్లేదు. దీంతో అంతా సిలిండర్ల కోసం ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. కానీ రాజస్థాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్లు స్పష్టం చేసింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Feb 2023, 4:40 pm
LPG Cylinder: రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రజాకర్షక మంత్రం జపించింది అక్కడి కాంగ్రెస్ సర్కార్. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగానే.. వంట గ్యాస్ సిలిండర్లపై ధరను భారీగా తగ్గించింది. ఈ మేరకు బడ్జెట్‌లో దీనిపైనా ప్రకటన చేశారు. ఉజ్వల యోజన పథకం కింద వంట గ్యాస్ సిలిండర్‌ను వినియోగించేవారికి రూ.500 కే అందిస్తామని చెప్పారు. ఈ ఒక్క నిర్ణయంతో ఏకంగా 76 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు సీఎం. దీంతో ఏప్రిల్ 1 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ లభ్యం కానుంది.
Samayam Telugu lpg gas cylinder


2022, డిసెంబర్‌లోనే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడారు గహ్లోత్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందిస్తామని అన్నారు. దీంతో అప్పట్లో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అన్నట్లుగానే దీనిని ఇప్పుడు బడ్జెట్‌లోనూ ప్రతిపాదించారు.

Adani Power: ఏకంగా 96 శాతం పడిపోయిన అదానీ కంపెనీ లాభం.. మరీ రూ.9 కోట్లేనా?

గ్యాస్ సిలిండర్ ధరలు కొంతకాలంగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రూ.1100కుపైనే చేరింది. దీంతో సిలిండర్ కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో సిలిండర్ కొనుగోలు చేశాక.. సబ్సిడీ రూపంలో వెనక్కి వచ్చేది. కానీ అది కూడా రద్దు చేసింది NDA ప్రభుత్వం. దీంతో రేట్లు రికార్డు స్థాయికి చేరి సామాన్య ప్రజలు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

Telangana: తెలంగాణలో మహీంద్రా కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడి.. KCR సర్కార్‌తో బిగ్ డీల్.. వందల మందికి ఉపాధి!

బడ్జెట్‌లో మరిన్ని కీలక ప్రకటనలు చేసింది గహ్లోత్ ప్రభుత్వం. రాజస్థాన్‌లో నిర్వహించే పోటీ పరీక్షలకు .. ఎగ్జామ్ ఫీజును మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంకా అమ్మాయిలకు 30 వేల ఎలక్ట్రిక్ స్కూటీలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో పాటు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పింది. 12వ క్లాస్ వరకు అమ్మాయిలకు ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించింది.

Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.