యాప్నగరం

Royal Enfield: మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకు.. వచ్చేది ఎప్పుడంటే..?

Royal Enfield: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయి. కార్ల నుంచి బైకులు, స్కూటర్ల వరకు ప్రతి రేంజ్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉండటంతో.. కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొంటున్నారు. దీంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లను, బైకులను తెస్తున్నాయి. డిమాండ్ పెరుగుతుండటంతోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన సరికొత్త ఎలక్ట్రిక్ బైకును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 14 Aug 2022, 1:30 pm

ప్రధానాంశాలు:

  • దూసుకెళ్తోన్న ఎలక్ట్రిక్ వెహికిల్స్
  • కస్టమర్ల నుంచి పెరుగుతోన్న డిమాండ్
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఈవీ బైకులపై ఫోకస్
  • సరికొత్త ఎలక్ట్రిక్ బైకును తెచ్చేందుకు ప్రయత్నాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Royal Enfield Bike
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు
Royal Enfield బైకులకు భారత మార్కెట్ నుంచి అద్భుతమైన డిమాండ్ వస్తుంది. తన కొనుగోలుదారుల్ని మరింత ఆకట్టుకునేందుకు తన మోడల్స్‌ను అప్‌డేట్ చేస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తర్వాత తరానికి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని లాంచ్ చేసేందుకు కంపెనీ చూస్తున్నట్టు తెలిసింది. తాజాగా ఈ కంపెనీ సరికొత్త హంటర్ 350 బైకుని లాంచ్ చేసింది. ఈ బైకు లాంచ్ అయిన వెంటనే కొత్త తరానికి చెందిన బుల్లెట్ 350పై వర్క్ చేస్తుందని పలు మీడియా రిపోర్టులు తెలిపాయి. అంతేకాక కొత్త ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసేందుకు కూడా కంపెనీ వర్క్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ రిపోర్టులు కనుక నిజమైతే.. రాయల్ ఎన్‌ఫీల్ట్ ప్రస్తుతం సరికొత్త ఎలక్ట్రిక్ బైకులపై పనిచేస్తుందని అర్థం. అయితే అధికారికంగా ఈ బైకును 2025 ఏడాదిలో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది.
దీంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఖర్చులను తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్కీమ్‌లను కూడా అందిపుచ్చుకోవాలని చూస్తోంది. ఈ స్కీమ్‌లతో ఎలక్ట్రిక్ బైకులను తయారీ చేసేందుకు కంపెనీకి ఇన్‌పుట్ ఖర్చులు తక్కువ కానున్నాయి. దీని వల్ల భారత మార్కెట్లో ఈ బైకుల ధరలు కూడా దిగి రానున్నాయి.

Also Read : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత.. వైరల్ అవుతున్న బిగ్ బుల్ వీల్‌చెయిర్ డ్యాన్స్ వీడియో

350 సీసీ, 650 సీసీ బైకులు..
భారత్‌లో తన పోర్టుఫోలియోను విస్తరించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం పనిచేస్తుంది. 350 సీసీ నుంచి 650 సీసీ సెగ్మెంట్‌లో పలు ప్రొడక్టులను ఆఫర్ చేసేందుకు చూస్తోంది. అంతేకాక సరికొత్తగా 450 సీసీ బైకును కూడా 2026-27లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంతేకాక ఇది రెండో తరం జే ప్లాట్‌ఫామ్‌పై లాంచ్ కాబోతుందని తెలుస్తోంది.

సరికొత్త ప్లాట్‌ఫామ్ కోడ్ నేమ్ జే2ను చాలా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు వాడుతుందని తెలుస్తోంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకుల కోసం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి టైమ్‌లైన్‌ను కంపెనీ నిర్ణయించలేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి కొన్నేళ్లలోనే ఎలక్ట్రిక్ ‌ బైకును తీసుకొస్తుందని తెలుస్తోంది. అయితే చాలా కంపెనీల సరికొత్త ఎలక్ట్రిక్ బైకులు భారత్‌తో సహా పలు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతున్నాయి.

Also read : NPS: ఎన్‌పీఎస్ ఖాతాదారులు యూపీఐ లావాదేవీలు చేసుకోవడమెలా..? ప్రాసెస్ తెలుసుకోండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.