యాప్నగరం

​200 రూపాయల నోటు వస్తోంది..!

కరెన్సీ నోట్ల విషయంలో ప్రయోగాలు కొనసాగుతున్నాయి

TNN 29 Jun 2017, 9:20 am
కరెన్సీ నోట్ల విషయంలో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మారకంలోని ఐదువందల, వెయ్యి నోట్లను కొన్ని నెలల కిందట రద్దు చేసిన మోడీ ప్రభుత్వం వాటి స్థానంలో రెండు వేల, ఐదు వందల రూపాయల నోట్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండు వందల రూపాయల నోట్లను తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. రెండు వందల రూపాయల నోటుతో దినసరి ఆర్థిక కార్యకలాపాలు సౌలభ్యంగా ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది.
Samayam Telugu rs 200 note to introduce
​200 రూపాయల నోటు వస్తోంది..!


మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ఆర్బీఐ ముద్రణాలయంలో ఇప్పటికే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ నోట్లు మారకంలోకి రానున్నాయని సమాచారం. ఈ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ పాలకమండలి ఇది వరకే ఆమోద ముద్ర వేసింది. ఈ నోట్లను అధునాతన సాంకేతికతతో రూపొందిస్తున్నారని, నకిలీలు తయారు చేయడానికి ఆస్కారం ఇవ్వకుండా రూపొందిస్తున్నారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.