యాప్నగరం

Stock Market News: కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో మార్కెట్లకు లాభాలు

ఆటోమొబైల్స్‌, పవర్‌, ఇన్‌ఫ్రా, ఐటీ, లోహ, ఫార్మా రంగ షేర్లు కొనుగోళ్ల తాకిడికి గురయ్యాయి.

Samayam Telugu 19 Nov 2018, 5:11 pm
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి.ఉదయం సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ట్రేడింగ్ ఆరంభించగా.. నిఫ్టీ 10,700 పైన ట్రేడింగ్ ఆరంభించింది. ప్రధాన రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్‌, పవర్‌, ఇన్‌ఫ్రా, ఐటీ, లోహ, ఫార్మా రంగ షేర్లు కొనుగోళ్ల తాకిడికి గురయ్యాయి. ఆర్‌బీఐ బోర్డు సమావేశం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
Samayam Telugu bull.


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317.72 పాయింట్ల లాభంతో 35,774.88 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 10763.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 31 పైసలు బలపడి 71.62 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో యస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా తదితర షేర్లు లాభాలు గడించగా.. ఇండియా బుల్స్ హౌసింగ్, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.