యాప్నగరం

Penny Stock: రూ.2 షేరు.. రూ.4 లక్షల ప్రాఫిట్!

Multibagger Stock: మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మల్టీబ్యాగర్ స్టాక్‌ను పట్టుకోవాలి. అప్పుడు ఆహా అనిపించే లాభాలు వస్తాయి. ఇందుకు ఒక స్టాక్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ షేరు ధర గత ఏడాది కాలంలో భారీ లాభాలు అర్జించి పెట్టింది. రూ. లక్ష పెట్టుబడిని రూ.4 లక్షలకు పైగా మార్చేసింది. అదే ఐదేళ్ల కాలంలో అయితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్‌నే అందించింది.

Authored byKhalimastan | Samayam Telugu 2 Jul 2022, 8:56 am

ప్రధానాంశాలు:

  • మల్టీ బ్యాగర్ షేరుతో కళ్లుచెదిరే లాభం
  • రూ. 2 షేరుతో రూ.లక్షల్లో ప్రాఫిట్
  • ఏడాదిలోనే భారీ లాభాన్ని అందించిన స్టాక్
  • గత వారం రోజులుగా పైపైకే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu penny stocks
చౌక ధర షేరుతో రూ.లక్షల్లో లాభం
Penny Shares: మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీటిల్లో డబ్బులు పెట్టిన వారికి భారీ లాభాలు వచ్చి ఉంటాయి. అందుకే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. వీటిని ముందుగానే పసిగట్టి డబ్బులు పెడితే తక్కువ కాలంలోనే మంచి ప్రాఫిట్ సొంతం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌లో చాలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు రూ.2 షేరు గురించి మాట్లాడుకుందాం. ఈ షేరు ఇన్వెస్టర్ల పంట పండించింది.
లాయిడ్స్ స్టీల్ అనే షేరు ఒకటుంది. ఈ ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ స్టాక్ ఏడాది కాలంలో 300 శాతానికి పైగా రాబడిని అందించింది. గత వారం రోజుల్లో ఈ షేరు బుల్లిష్ ట్రెండ్‌లోనే ఉంది. అప్పర్ సర్క్యూట్ తాకింది. 2017 జూలై 7న ఈ స్టాక్ ధర కేవలం రూ1.7 మాత్రమే. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ ధర రూ. 11.8గా ఉంది. అంటే ఈ కాలంలో షేరు ధర 594 శాతం రాబడిని ఇచ్చింది.

Also Read: undefined

గత ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఈ స్టాక్ రూ. 2.9 నుంచి పైకి కదులుతూ వచ్చింది. ఇప్పుడు రూ. 11.8 స్థాయికి ఎగసింది. అంటే దాదాపు 300 శాతానికి పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ స్టాక్ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నష్టాలను మిగిల్చింది. షేరు రూ. 20 నుంచి పడిపోయింది. 2022లో ఇప్పటి దాకా షేరు ధర 42 శాతం కుప్పకూలింది. అయితే గత ఐదే ట్రేడింగ్ సెషన్లలో చూస్తే ఈ షేరు ధర 20 శాతం పైకి చేరింది. రూ. 9.8 నుంచి రూ. 11.8కు చేరింది. అదే గత 7 ట్రేడింగ్ సెషన్లు తీసుకుంటే స్టాక్ ధర 40 శాతం పరుగులు పెట్టింది.

అంటే ఉదాహరణకు మీరు ఈ షేరులో ఏడాది కిందట రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 4.6 లక్షలకు చేరి ఉంటేంది. అలాగే ఐదేళ్ల కిందట మీరు ఈ స్టాక్ డబ్బులు పెట్టి ఉంటే.. ఇప్పుడు మీకు రూ. 6.94 లక్షలు వచ్చేవి. కాగా స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇంకా ఎక్కువ ప్రమాదం. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోండి.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.