యాప్నగరం

Mankind Pharma IPO: అదరగొట్టిన ఐపీఓ.. లిస్టింగ్‌లోనే ఒక్కో లాట్‌పై వేలల్లో లాభం.. త్వరపడండి!

Mankind Pharma IPO: చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లలో ఐపీఓ సందడి చేసింది. మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. దీని ఇష్యూ ధర రూ.1080గా నిర్ణయించగా.. ఏకంగా రూ.220 వరకు పెరిగి రూ.1300 వద్ద లిస్టయింది. ఆ తర్వాత కూడా పెరుగుకుంటూ పోయి డబ్బులు పెట్టిన వారికి అదిరిపోయే లాభం అందించింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 9 May 2023, 2:50 pm
Mankind Pharma IPO: దలాల్ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత ఒక ఐపీఓ మళ్లీ సందడి చేసింది. మంచి ప్రారంభం లభించింది. అదే ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మ్యాన్‌‌కైండ్ ఫార్మా. ఈ కంపెనీ షేర్లు.. స్టాక్ ఎక్స్చేంజీల్లో తొలిసారిగా ఇవాళ నమోదయ్యాయి. ఇక వచ్చీ రాగానే అదరగొట్టింది. రూ.1080ని ఇష్యూ ధరగా ప్రకటించగా.. BSE లో ఏకంగా 20 శాతం లేదా రూ.220 పెరిగి రూ.1300 వద్ద లిస్టయింది. తర్వాత కూడా పెరుగుకుంటూ పోయింది. ఒక దశలో దాదాపు 30 శాతం లాభంతో రూ.1400 వద్ద గరిష్టాన్ని తాకింది. NSE లో కూడా రూ.1300 దగ్గర లిస్టయింది. లిస్టింగ్ ప్రైజ్ దగ్గరే కంపెనీ మార్కెట్ విలువ రూ.54,816.52 కోట్లుగా నమోదైంది.
Samayam Telugu Mankind IPO


ఈ ఐపీఓ కోసం కనీసం ఒక లాట్ (13 షేర్లు) కొనాలని నిర్దేశించారు. అంటే ఐపీఓలో పాల్గొన్నవారు కనీసం రూ.14,040 పెట్టుబడిగా పెట్టారన్నమాట. ఇక షేర్లు అలాట్ అయినవారికి పెట్టుబడి లిస్టింగ్ ప్రైజ్ దగ్గర రూ.16,900కు చేరింది. ఒక్కో షేరుపై రూ.220 లాభం ఇలా.. ఒక్కో లాట్‌పై ఇందులో డబ్బులు పెట్టినవారికి రూ.2860 మేర లాభం వచ్చింది. ఇక ఆ తర్వాత రూ.1400కు పోయినప్పుడు అమ్మితే ఇంకా అధిక లాభం వస్తుంది.

Home Loan: హోం లోన్ కోసం చూస్తున్నారా? ఈ బ్యాంకుల్లోనే తక్కువ వడ్డీ.. ఫుల్ లిస్ట్ ఇదే!

ఇక మ్యాన్‌కైండ్ ఫార్మా విషయానికి వస్తే.. ఐపీఓలో షేర్లకు 15.32 రెట్ల మేర స్పందన లభించింది. రూ.1026 నుంచి రూ.1080 ప్రైస్ రేంజ్‌లో ఈ షేర్లు ఐపీఓకు వచ్చాయి. మొత్తంగా దాదాపు 40058844 ఈక్విటీ షేర్లను విక్రయించగా.. ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కిందనే జరిగింది. కొత్తగా షేర్లను జారీ చేయలేదు. ఈ లెక్కన ఐపీఓలో సమకూరిన నిధులు అన్నీ పూర్తిగా ప్రమోటర్లకే చెందుతాయి.



మ్యాన్‌కైండ్ ఫార్మా కంపెనీ విషయానికి వస్తే.. ఇది పలు రకాల దీర్ఘ, స్వల్పకాల రోగాలు/వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తుంటుంది. ముఖ్యంగా గర్భనిర్ధరణ, గర్భనిరోధక, యాంటాసిడ్ పౌడర్లు, మినరల్ సప్లిమెంట్లు, యాంటీ యాక్నే కేటగిరీల్లో ఔషధాలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా మ్యాన్‌కైండ్ ఫార్మా కంపెనీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2022 డిసెంబర్ వరకు ఈ సంస్థకు మొత్తం 25 తయారీ కేంద్రాలున్నాయి. నాలుగు పరిశోధన- డెవలప్‌మెంట్ సెంటర్లు పనిచేస్తున్నాయి. మొత్తంగా 600 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

మస్క్ కీలక ప్రకటన.. ఆ ట్విట్టర్ ఖాతాల తొలగింపు.. తగ్గనున్న ఫాలోవర్లు.. కారణం ఇదే!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.