యాప్నగరం

రెండోరోజూ లాభాల బాటలోనే మార్కెట్లు..!

వరసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. కొనుగోళ్లు పెరగడంతో శుక్రవారం (ఏప్రిల్ 27) ప్రారంభం నుంచే 180 పాయింట్ల లాభంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి.

TNN 27 Apr 2018, 5:02 pm
వరసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. కొనుగోళ్లు పెరగడంతో శుక్రవారం (ఏప్రిల్ 27) ప్రారంభం నుంచే 180 పాయింట్ల లాభంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడి 35,000 స్థాయికి చేరి... కాస్తా వెనక్కి తగ్గి చివరకు 256.10 (0.74%) పాయింట్ల లాభంతో 34,969.70 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది. 74.50 (0.70%) పాయింట్లు లాభపడి 10,692.30 వద్ద ముగిసింది.
Samayam Telugu market3


అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ & టీ, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తదితర షేర్లు లాభాలు గడించాయి.

హిందూస్థాన్ యునిలీవర్, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహింద్రా, టీసీఎస్‌, మారుతి సుజుకీ, విప్రోతదితర షేర్లు నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.