యాప్నగరం

తక్కువ ధరకే 3జీబీ ర్యామ్‌తో కూల్‌ప్యాడ్ ఫోన్!

తక్కువ ధరకే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న చైనా కంపెనీ కూల్‌ప్యాడ్ భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది.

TNN 16 Mar 2017, 7:27 pm
తక్కువ ధరకే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న చైనా కంపెనీ కూల్‌ప్యాడ్ భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. నోట్‌ప్యాడ్ కూల్‌ప్యాడ్ 5 లైట్ పేరుతో విడుదలైన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,199. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కూల్‌ప్యాడ్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌కి లైట్ వర్షన్‌గా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్చి 21 నుంచి అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనుంది.
Samayam Telugu coolpad note 5 lite smartphone with 3gb ram launched at rs 8199
తక్కువ ధరకే 3జీబీ ర్యామ్‌తో కూల్‌ప్యాడ్ ఫోన్!


ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లేతో వచ్చిన ఈ కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్‌లో 3జీబీ ర్యామ్‌తో కూడిన క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను వాడారు. ఇంటర్నల్ స్టోరేజీ 16జీబీ. మైక్రోఎస్డీతో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4జీ వీవోఎల్టీఈ, 3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ సరా మామూలే. ఇక ప్రధానంగా దీనిలో 2,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 ఎంపీ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ బంగారు, బూడిద రంగుల్లో లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.