యాప్నగరం

దిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ టార్గెట్ 189

ఐపీఎల్ పదో సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు

TNN 15 Apr 2017, 9:51 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఫిరోజ్‌షా కోట్ల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శామ్ బిల్లింగ్స్ (55: 40 బంతుల్లో 9x4), కోరె అండర్సన్ (40 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 3x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది. పుణెతో మ్యాచ్‌లో శతకం బాది ఫామ్‌లోకొచ్చిన సంజు శాంసన్ (19) నిరాశపరిచినా.. బిల్లింగ్స్ నిలకడగా ఆడాడు. జట్టు స్కోరు 53 వద్ద కరియప్ప బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి శాంసన్ ఔటవగా.. అనంతరం వచ్చిన కరుణ్ నాయర్ (0) పరుగులేమీ చేయకుండానే అరోన్ బౌలింగ్‌ ఔటయ్యాడు.
Samayam Telugu dd vs kxip 15th match
దిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ టార్గెట్ 189


ఈ దశలో శ్రేయాస్ అయ్యర్‌(22)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన బిల్లింగ్స్ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కానీ.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో శ్రేయాస్ కూడా వెనుదిరగ్గా.. రిషబ్ పంత్ (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో దిల్లీ కొంచెం ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. కానీ.. చివర్లో క్రిస్ మోరీస్ (16), కోరె అండర్స్ బ్యాట్ ఝళిపించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. పంజాబ్ బౌలర్లలో వరుణ్ అరోన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కరియప్ప తలో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.