యాప్నగరం

బెంగళూరు గెలిచిందోచ్..!

చివర్లో మహ్మద్ షమీ దూకుడుగా ఆడి.. బెంగళూరును కంగారు పెట్టినా పవన్ నేగి అతడ్ని బోల్తా కొట్టించడంతో

TNN 15 May 2017, 12:29 am
ఐపీఎల్ పదో సీజన్‌లో వరుసగా ఏడు ఓటములతో ఢీలాపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గెలుపుతో టోర్నీని ముగించింది. ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (58: 45 బంతుల్లో 3x4, 3x6), క్రిస్‌గేల్ (48: 38 బంతుల్లో 3x4, 3x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఛేదనలో రిషబ్ పంత్ (45: 34 బంతుల్లో 3x4, 2x6), శ్రేయాస్ అయ్యర్ (32: 30 బంతుల్లో 2x4, 1x6) మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది.
Samayam Telugu dd vs rcb royal challengers bangalore won by 10 runs
బెంగళూరు గెలిచిందోచ్..!


సంజు శాంసన్ (0), కోరె అండర్సన్ (3), కమిన్స్ (7) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని జట్టును ఒత్తిడిలో పడేశారు. చివర్లో మహ్మద్ షమీ (21: 9 బంతుల్లో 3x4, 1x6) దూకుడుగా ఆడి.. బెంగళూరును కంగారు పెట్టినా పవన్ నేగి అతడ్ని బోల్తా కొట్టించడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన నేగి రెండో బంతికి షమీని,. చివరి బంతికి నదీమ్‌ని ఔట్ చేసి బెంగళూరును గెలిపించాడు. ఈ ఓటమితో 12 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఏడు పాయింట్లు మాత్రమే సాధించిన బెంగళూరు చివరి స్థానంలో సీజన్‌ని ముగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.