పంజాబ్పై బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ
అనారోగ్యం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకి దూరమైన దిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ జట్టుతో చేరగా.. ఆదిత్య తారెపై వేటు
TNN 15 Apr 2017, 8:02 pm
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన దిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లో ఓడిన దిల్లీ.. అనూహ్యంగా రెండో మ్యాచ్లో పుంజుకుని రైజింగ్ పుణె సూపర్ జెయింట్ని మట్టికరిపించి సీజన్లో బోణి కొట్టింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్లో గెలిచిన కింగ్స్ పంజాబ్ జట్టు.. కోల్కతా చేతిలో ఓడి ఒత్తిడిలో ఉంది. అనారోగ్యం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకి దూరమైన దిల్లీ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుతో చేరగా.. ఆదిత్య తారెపై వేటు పడింది. పంజాబ్ జట్టులో స్టాయినిస్, ఇషాంత్ శర్మ స్థానంలో మోర్గాన్, కరియప్ప వచ్చారు.
పంజాబ్ జట్టు
హసీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, ఇయాన్ మోర్గాన్, మాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, వరుణ్ అరోన్, సందీప్ శర్మ, కరియప్ప
దిల్లీ జట్టు
శ్రేయాస్ అయ్యర్, శ్యామ్ బిల్లింగ్స్, సంజు శాంసన్, రిషబ్ పంత్, కోరె అండర్సన్, క్రిస్ మోరీస్, కరుణ్ నాయర్, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్, జహీర్ ఖాన్
పంజాబ్ జట్టు
హసీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, ఇయాన్ మోర్గాన్, మాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, వరుణ్ అరోన్, సందీప్ శర్మ, కరియప్ప
దిల్లీ జట్టు
శ్రేయాస్ అయ్యర్, శ్యామ్ బిల్లింగ్స్, సంజు శాంసన్, రిషబ్ పంత్, కోరె అండర్సన్, క్రిస్ మోరీస్, కరుణ్ నాయర్, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్, జహీర్ ఖాన్