యాప్నగరం

AP EAMCET Counselling 2020: నేటి నుంచి రెండో విడత ఏపీ ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..!

apeamcet.nic.in: ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నేటి (జనవరి 21) నుంచి ప్రారంభం కానుంది.

Samayam Telugu 21 Jan 2021, 7:35 am
ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ (APSCHE) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నేటి (జనవరి 21) నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధిత ర్యాంకర్లు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈనెల 25వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు https://apeamcet.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu ఏపీ ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు


పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఫిబ్రవరి 1లోపు అప్లయ్‌ చేసుకోండి
అయితే.. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. మొదటి రౌండ్‌లో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లను ఈ దశ కౌన్సిలింగ్‌లో భర్తీ చేయనున్నారు. కాగా.. మొదటి దశలో సీట్లు పొందినా ఇప్పటి వరకు రిపోర్ట్ చేయని వారి సీట్లను సైతం ప్రస్తుతం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.