యాప్నగరం

AP EDCET Counselling 2022: ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే

AP EdCET Web Counselling 2022: ఏపీ ఎడ్‌ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ ఎడ్‌ సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే రామమోహన్ రావు షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 20 Oct 2022, 5:48 pm
AP EDCET Counselling 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఏపీ ఎడ్‌ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ ఎడ్‌ సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే రామమోహన్ రావు షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఎడ్‌సెట్‌ ఫస్ట్‌ ఫేజ్‌ అడ్మిషన్లకు శుక్రవారం (అక్టోబర్‌ 21) నోటిఫికేషన్‌ విడుదల కాన్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టగా.. 26 నుంచి 31 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుందని తెలిపారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న విజయవాడ లయోలా కాలేజ్‌లో సర్టిఫికేట్లు పరిశీలించన్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu AP EDCET Counselling 2022


నవంబర్ ఒకటి నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా.. నవంబర్ మూడో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పుకి అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 5న విద్యార్ధులకు సీట్ల కేటాయించనున్నారు. నవంబర్ 7నుంచి 9లోపు కళాశాలలో చేరేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. నవంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

APPSC Jobs: ఏపీలో భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలివే

ఏపీలో గ్రూప్‌ 1 అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభం
APPSC Group 1 Notification 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌–1 ఉద్యోగాల‌ భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ (APPSC Group 1 Notification) ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 దరఖాస్తులకు చివరితేది. దీంతో పాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు కూడా APPSC నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.