యాప్నగరం

AP: గురుకుల స్కూల్స్‌ 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

2020-21కి గాను గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Samayam Telugu 6 Jul 2020, 8:36 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Samayam Telugu గురుకుల స్కూళ్లు


ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎం.ఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు.

ఈనెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి, ఎంపికైన వారికి కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయింపు చేపడతారు.

గుంటూరుజిల్లాలోని తాడికొండ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, క`ష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల విద్యార్థులు అర్హులు.

అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్లి రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలలకు నెల్లూరుతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. జులై 20, 2020 దరఖాస్తుకు చివరితేదీ.

దరఖాస్తు పత్రాలను https://aprjdc.apcfss.in/ లేదా https://apreis.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలోనే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.