యాప్నగరం

AP Inter Admissions 2020-21: రేపటి నుంచి ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ప్రారంభం..!

ఈ ఏడాది మొదటిసారి ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్‌ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 20 Oct 2020, 6:07 pm
ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు రేపటి (అక్టోబ‌రు 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొదటిసారి ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్‌ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఎక్కడినుంచైనా కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అకడమిక్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదు.
Samayam Telugu ఏపీ ఇంటర్‌ ప్రవేశాలు


పదో తరగతి హాల్‌టికెట్‌ నంబరు, కుల, ఆదాయ ధ్రువపత్రాల నంబర్లు వేస్తే సరిపోతుంది. దరఖాస్తుల స్వీకరణకు వారం లేదా పది రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు కొత్త ఫీజులను నిర్ణయించలేదు. పాత ఫీజులనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

ఇక.. ప్రభుత్వం తాజా నిర్దేశించిన ఆదేశాల ప్రకారం విద్యార్థులు ఎంపిక చేసుకున్న కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, ఫీజులు, అకడమిక్‌ వివరాలు తదితర అన్నీ విషయాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Must read: ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీఓపెన్‌.. ఒక పూట మాత్రమే బడి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.