యాప్నగరం

AP EAMCET Counselling 2020: రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం..!

రేపటి నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.

Samayam Telugu 22 Oct 2020, 8:16 pm
ఏపీలో రేపటి (అక్టోబర్‌ 23) నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌గా.. గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.
Samayam Telugu ఏపీ ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్


షెడ్యూల్‌ ఇలా:
  • అక్టోబ‌ర్ 23 ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తారు.
  • 24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వ‌ర‌కు
  • 25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు
  • 26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు
  • 27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది.

Must read: ఏపీలో 2173 గ్రామ, వార్డు వాలంటీర్‌ జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు..!

ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్‌) ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. అభ్యర్థులు https://apeamcet.nic.in/ ద్వారా రేపటి (అక్టోబర్‌ 23) నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించవచ్చు.

నోటిఫికేషన్‌:

ap eamcet

Also read: ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.