యాప్నగరం

APMS: టెన్త్‌ పాసైన వారికి మరో ఛాన్స్‌.. మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించింది.

Samayam Telugu 31 Jul 2020, 8:22 pm
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించింది. మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడుదు 2020 జూలై 31తో ముగియాలి. కానీ ఈ గడువును ఆగస్టు 25, 2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల విద్యార్థులు ఆగస్ట్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Samayam Telugu ఏపీ మోడల్‌ స్కూల్ ప్రవేశాలు


ఇంగ్లిష్‌ మీడియం బోధన:
పదవ తరగతి పాసైన విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకొని కాపీని సంబంధిత ప్రిన్సిపాల్‌కు నిర్ణీత గడువులోగా సమర్పించాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించరు. అన్ని కోర్సుల్లో సీట్ల కేటాయింపులో 33.33 శాతం బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు.

త్వరలో కొత్త షెడ్యూల్‌:
పాత షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 1న దరఖాస్తుల్ని పరిశీలించి.. ఆగస్ట్ 3న సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదే రోజున తరగతుల్ని కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం దరఖాస్తు గడువును పొడిగించడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్, తరగతులను ప్రారంభించే షెడ్యూల్ మొత్తం మారనుంది.

Also read: ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. గ్రామీణ విద్యార్థుల కోసం విద్యా వారధి మొబైల్ వాహనాలు ప్రారంభం

Also read: ఇకపై ప్రైవేటు టీచర్లుకూ కఠిన నిబంధనలు.. ఈ అర్హతలు ఉంటేనే టీచర్గా పనిచేసే అవకాశం..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.