యాప్నగరం

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్

CSAB 2020 Counselling: మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్‌ జారీ చేసింది.

Samayam Telugu 9 Nov 2020, 8:48 am
ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదవాలని కోరుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది.
Samayam Telugu ప్రత్యేక కౌన్సెలింగ్


దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలకేషనల్‌ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించిన విషయం తెలిసిందే.

Must read: ఇంటర్ ఉత్తీర్ణత‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు త్వరపడండి..!

సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్‌ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్‌ తరువాత ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో మరికొంత మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లభించనుంది.

Also read: రైల్వేలో 110 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.