యాప్నగరం

ఈనెల 15 నుంచి దోస్త్ స్పెషల్‌ కౌన్సెలింగ్..!

ఎంసెట్ కౌన్సెలింగ్ దృష్టిలో ఉంచుకుని మ‌రో విడ‌త డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నారు.

Samayam Telugu 13 Oct 2020, 7:55 pm
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 15 నుంచి Degree Online Services Telangana (DOST) ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ దృష్టిలో ఉంచుకుని మ‌రో విడ‌త విద్యార్థుల‌కు ప్ర‌త్యేకంగా అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని అధికారులు వెల్ల‌డించారు. అక్టోబ‌ర్ 15 నుంచి 26 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని.. 27వ తేదీవ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవ‌చ్చ‌ని తెలిపారు.
Samayam Telugu దోస్త్‌ అడ్మిషన్లు 2020


దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబ‌ర్ 30న సీట్లు కేటాయిస్తామ‌న్నారు. దోస్త్ ఫేజ్–3 రిజిస్ర్టేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. వీరికి ఈనెల 15న సీట్లు కేటాయిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Must read: అమ్మాయిలకు రూ.24 వేల‌ స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరు తేది..!

Also read: ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సరికొత్త ఫీచర్.. త్వరలో అందరికీ అందుబాటులోకి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.