ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మొదటిసారిగా ట్రిపుల్ఐటీల్లో సీట్ల కేటాయింపునకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మ్యాథ్స్, సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల వ్యవధిలో.. పెన్ను, పేపర్ (ఆఫ్లైన్) విధానంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు సుమారు 60 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట్లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించాలనుకున్నా.. ప్రైవేటు స్కూళ్లు ఎక్కువ మార్కులు వేసినట్లు పరిశీలనలో తేలడంతో ఆ విధానాన్ని విరమించుకున్నారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేశారు. ఈసారి టెన్త్లో మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికి వచ్చారు.
Must read: ఈనెల 28 నుంచి ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు..?
Also read: ముగిసిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు.. ఈనెల 26న ప్రాథమిక కీ విడుదల..!
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేశారు. ఈసారి టెన్త్లో మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికి వచ్చారు.
Must read: ఈనెల 28 నుంచి ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు..?
Also read: ముగిసిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు.. ఈనెల 26న ప్రాథమిక కీ విడుదల..!