యాప్నగరం

JNTUH: జేఎన్‌టీయూహెచ్‌లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.. నోటిఫికేషన్‌ విడుదల

IDP: జేఎన్‌టీయూహెచ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Samayam Telugu 9 Dec 2020, 7:53 pm
జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బీటెక్, ఎంఈ, ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీడీఎంపీ)లో భాగంగా బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తోంది. అభ్యర్థులు ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పించారు.
Samayam Telugu జేఎన్‌టీయూహెచ్‌


Must read: ఇంటర్‌ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈనెల 15 ఆఖరు తేదీ

ముఖ్య సమాచారం:
  • కోర్సులు: బీటెక్‌, ఎంఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ
  • అర్హతలు: 10+2 లేదా ఇంటర్‌, సీబీఎస్సీ లేదా ఐసీఎస్సీ, తత్సమాన కోర్సులు చేసినవారు దరఖాస్తుకు అర్హులు.
  • ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్‌, టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. జేఈఈ, ఎంసెట్‌ అభ్యర్థులకు చెరో 50 శాతం సీట్లు కేటాయించారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1500
  • దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 18, 2020
  • ఆలస్య రుసుంతో చివరితేదీ: డిసెంబర్‌ 22, 2020
  • కౌన్సెలింగ్‌: డిసెంబర్‌ 23, 2020

Also read: ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష తేదీలు వెల్లడించిన యూపీఎస్సీ.. వివరాలివే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.