పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్)లో 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఎంబీబీఎస్లో వ్రవేశానికి ప్రవేశ ప్రకటన బుధవారం(మార్చి 6) విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ప్రవేశపరీక్షను జూన్ 2న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30; మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రెండు విడతలుగా దేశవ్యాప్తంగా 120 నగరాల్లో నిర్వహించనున్నారు. గతేడాది జిప్మర్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై, ఏప్రిల్ 13 వరకు కొనసాగింది. జూన్ 3న పరీక్ష నిర్వహించి.. జూన్ రెండో వారంలోనే ఫలితాలను విడుదల చేశారు.
దరఖాస్తు ఇలా..
✪ మొదట జిప్మర్ అధికారిక వెబ్సైట్ http://jipmer.edu.in/ లోకి లాగిన్ అవ్వాలి.
✪ తర్వాత అక్కడ కనిపించే 'Apply Online for JIPMER MBBS 2019' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
✪ క్లిక్ చేయగానే వచ్చే ఖాళీల్లో అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
✪ వివరాలు నమోదుచేసి submit చేయాలి.
✪ దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకొని.. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
Notification
Online Application
Website
దరఖాస్తు ఇలా..
✪ మొదట జిప్మర్ అధికారిక వెబ్సైట్ http://jipmer.edu.in/ లోకి లాగిన్ అవ్వాలి.
✪ తర్వాత అక్కడ కనిపించే 'Apply Online for JIPMER MBBS 2019' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
✪ క్లిక్ చేయగానే వచ్చే ఖాళీల్లో అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
✪ వివరాలు నమోదుచేసి submit చేయాలి.
✪ దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకొని.. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
Notification
Online Application
Website