యాప్నగరం

JEE Main - 2020 దరఖాస్తుకు నేడే ఆఖరు

JEE (Main) January 2020 | దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు కల్పించడంతోపాటు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి జేఈఈ మెయిన్‌ నిర్వహణ బాధ్యతను గతేడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏటా రెండుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తోంది.

Samayam Telugu 30 Sep 2019, 10:12 am

ప్రధానాంశాలు:

  • సెప్టెంబరు 30న రాత్రి 11.50 గం. వరకు దరఖాస్తుకు అవకాశం
  • జనవరి 6 - 11 వరకు పరీక్షల నిర్వహణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jee MAin 2020
జేఈఈ (మెయిన్‌)-2020 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం (సెప్టెంబరు 30)తో ముగియనుంది. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు సెప్టెంబరు 30న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్-2020కు సంబంధించి.. 2020 జనవరిలో 'జేఈఈ మెయిన్-1' పరీక్ష, ఏప్రిల్‌లో 'జేఈఈ మెయిన్-2' పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.
JEE Main 2020 Online Application
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యేలోపు రెండుసార్లు జేఈఈ (మెయిన్‌) నిర్వహించాలన్నది ఎన్‌టీఏ ప్రణాళిక. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 11 వరకు మొదటి విడత పరీక్షలు.. అలాగే ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనుంది. రెండోసారి నిర్వహించే పరీక్షలకు ఎన్‌టీఏ ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.

Dont Miss: విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఈఈ మెయిన్‌లో తగ్గిన ప్రశ్నలు

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత.

వయసు: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు..

✪ బీఈ/బీటెక్ (లేదా) బీఆర్క్ (లేదా) బీప్లానింగ్ పరీక్షకు దరఖాస్తు చేసేవారు (ఏదైనా ఒక పేపర్)..
కేటగిరీఇండియాఇండియా వెలుపల
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీబాలురు-రూ.650బాలికలు-రూ.325బాలురు-రూ.3000బాలికలు-రూ.1500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్బాలురు-రూ.325బాలికలు-రూ.325బాలురు-రూ.1500బాలికలు-రూ.1500

✪ బీఈ/బీటెక్, బీఆర్క్ (లేదా) బీఈ/బీటెక్, బీప్లానింగ్ (లేదా) బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ (లేదా) బీఆర్క్, బీప్లానింగ్ (ఒకటి కంటే ఎక్కువ పేపర్లు రాసేవారు)..
కేటగిరీఇండియాఇండియా వెలుపల
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీబాలురు-రూ.1300బాలికలు-రూ.650బాలురు-రూ.6000బాలికలు-రూ.3000
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్బాలురు-రూ.650బాలికలు-రూ.650బాలురు-రూ.3000బాలికలు-రూ.3000

జేఈఈ మెయిన్-2020 పరీక్షల షెడ్యూలు ఇలా..
✦ జేఈఈ మెయిన్-2020కి సంబంధించి మొదటి విడత పరీక్షలను జనవరిలో, రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌లో పరీక్షలు
నిర్వహించనున్నారు.
✦ జేఈఈ మెయిన్-1 దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 2 నుంచి 30 వరకు కొనసాగనుంది. జనవరి 6-11 వరకు పరీక్షలు నిర్వహించి.. జనవరి 31న ఫలితాలను వెల్లడించనున్నారు.
✦ జేఈఈ మెయిన్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి మార్చి వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 3-9 వరకు పరీక్షలు నిర్వహించి.. ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించనున్నారు.

Dont Miss: జేఈఈ మెయిన్-2020 పరీక్ష విధానం, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం03.09.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ30.09.2019 (11.50 P.M.)
ఫీజు చెల్లింపు ప్రక్రియ (ఆన్‌లైన్ ద్వారా)03.09.2019 - 01.10.2019 (11.50 P.M.)
పరీక్ష తేదీలు06.01.2020 - 11.01.2020
ఫలితాల వెల్లడి31.01.2020
Official Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.