యాప్నగరం

JoSAA Counselling 2022: ఈ రోజు నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ఈ వివరాలను తెలుసుకోండి

JEE Advanced Result 2022: జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JoSAA Counselling 2022) కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 12 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11వ తేదీన వెల్లడయ్యాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Sep 2022, 11:44 am
JoSAA Counselling 2022: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JoSAA Counselling 2022) కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 12 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగ‌స్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11వ తేదీన వెల్లడయ్యాయి. అనంతరం ఈ రోజు (సెప్టెంబర్‌ 12) నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుందని ఐఐటీ బాంబే ప్రకటించింది.
Samayam Telugu JoSAA Counselling 2022


అయితే 20వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని.. దానివల్ల అభ్యర్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవడానికి వీలువుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అసలు ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ మేరకు 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించి షెడ్యూల్‌ వెల్లడించింది.

6 రౌండ్ల అనంతరం ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ జరుపుతారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40 వేలు.. ఇతరులు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు https://josaa.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే

JoSAA Counselling - 6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:
  • 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
  • 2వ రౌండ్‌: సెప్టెంబరు 28వ తేదీ
  • 3వ రౌండ్‌: అక్టోబరు 3
  • 4వ రౌండ్‌: 8వ తేదీ
  • 5వ రౌండ్‌: 12వ తేదీ
  • 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.